Political News

వైసీపీలో అంద‌రూ ఎంపీల‌కు త‌ల‌నొప్పే ?

వైసీపీలో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు ఉన్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ ఎంపీలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల నుంచి తీవ్ర అస‌మ్మ‌తి ఎదుర్కొంటున్నారు. పార్టీలో కీల‌కంగా చ‌క్రం తిప్పే ఎంపీల‌కు సైతం ఈ అస‌మ్మ‌తి త‌ప్ప‌డం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ను విజ‌యసాయి, మంత్రి అవంతి, జిల్లా ఎమ్మెల్యేలు పూర్తిగా డ‌మ్మీల‌ను చేసేశార‌న్న చ‌ర్చ ఉంది. ఆయ‌న కూడా ఏదో ఎంపీగా ఉండ‌డం మిన‌హా చేసేదేం లేదు. అన‌కాప‌ల్లి ఎంపీ స‌త్య‌వ‌తికి స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్‌కు కోల్డ్ వార్ తీవ్ర‌మైంది.

ఇక గోదావ‌రిలో అంద‌రూ ఎమ్మెల్యేల‌కు అస‌మ్మ‌తి త‌ప్ప‌డం లేదు. కాకినాడ ఎంపీ వంగా గీత‌కు పిఠాపురం ఎమ్మెల్యే దొర‌బాబుకు ప‌డ‌ట్లేదు. గీత క‌న్ను పిఠాపురం మీద ఉండ‌డ‌మే కార‌ణ‌మంటున్నారు. అమ‌లాపురం ఎంపీ చింతా అనూరాథ‌కు మంత్రి విశ్వ‌రూప్‌తోనూ, మ‌రో మంత్రి చెల్లుబోయిన వేణుతోనూ, రాజోలు వైసీపీ నేత‌ల‌తోనూ పొస‌గ‌ట్లేదు. ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాకు తీవ్ర‌మైన యుద్ధం న‌డుస్తోంది. ఆ మాట‌కు వ‌స్తే ఎంపీ భ‌ర‌త్‌తో మ‌రి కొంద‌రు నేత‌ల‌కు కూడా ప‌డ‌ట్లేదు.

ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు మంత్రి ఆళ్ల నానితో గ్యాప్ ఉందంటున్నారు. ఇటు శ్రీథ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఎలీజా సైతం శ్రీథ‌ర్‌కు వ్య‌తిరేకంగా గ్రూప్ న‌డుపుతున్నారు. న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు రఘురామ కృష్ణంరాజు ఏకంగా పార్టీలోనే పెద్ద అస‌మ్మ‌తి నేత అయిపోయారు. బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఆయ‌న పార్ల‌మెంటు ప‌రిధిలోని ప‌లువురు పార్టీ నేత‌ల‌తోనే కాకుండా ఇటు ఆయ‌న‌కు సంబంధం లేకపోయినా గుంటూరు పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవితోనూ త‌క‌రారు న‌డుస్తోంది.

న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయుల‌కు ఆయ‌న పార్ల‌మెంటు ప‌రిధిలోని ఎమ్మెల్యేలు విడ‌ద‌ల ర‌జ‌నీ, కాసు మ‌హేష్ రెడ్డి, బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుతో స‌ఖ్య‌త లేదు. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట‌కు మంత్రి బాలినేనికి గ్యాప్ ఉంది. అటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్యేల‌తో పొస‌గ‌క పోయినా ఆయ‌న వ్యాపారాలు చేసుకుంటూ నెల్లూరు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

క‌డ‌ప‌, రాజంపేట ఇద్ద‌రు ఎంపీలు స్ట్రాంగ్‌గానే ఉన్నా వీరికి జ‌గ‌న్‌తో ఉన్న అనుబంధం నేప‌థ్యంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో జోక్యం చేసుకుంటున్నార‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అనంత‌పురం జిల్లాలో ఇద్ద‌రు ఎంపీల‌కు ఎమ్మెల్యేలకు కూడా పొస‌గ‌ట్లేదు. ఉన్నంత‌లో క‌ర్నూలు జిల్లా ఎంపీల‌తో పాటు బందరు, విజ‌య‌న‌గ‌రం, అర‌కు ఎంపీలే కాస్త వివాదాల‌కు దూరంగా ఉంటోన్న ప‌రిస్థితి ఉంది.

Satya

Recent Posts

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

11 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

3 hours ago