Political News

పవన్-షర్మిల మధ్యే పోటీనా ?

వినటానికి విచిత్రంగా ఉన్న రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారమైతే ఇదే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చాలా సంవత్సరాలే అయినా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా క్రియాశీలం కాలేదు. రాష్ట్రకమిటిని కూడా పూర్తిస్ధాయిలో నియమించకపోవటమే ఇందుకు నిదర్శనం. ఏదో ఓ ఐదుగురితో సమన్వయ కమిటి అనేదాన్ని వేసేసి రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు.

ఇక షర్మిల విషయానికి వస్తే తొందరలోనే తెలంగాణాలో పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించటంతో పాటే ముందుగా రాష్ట్ర కమిటి ఏర్పాటును కూడా నియమించేస్తారనే ప్రచారం జరుగుతోంది. తర్వాత వీలైనంత తొందరలో జిల్లాల కమిటీల నియామకం కూడా జరుగుతుందని లోటస్ పాండ్ ముఖ్యులు చెబుతున్నారట. షర్మిల ప్రధాన దృష్టంతా సీమాంధ్ర సెటిలర్లు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానుల మీదే ఉంది. ఇందులో కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, జీహెచ్ఎంసీ పరిధిపైనే ఉంది.

ఇదే పద్దతిలో పవన్ కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. తొందరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా పై జిల్లాల్లో కమిటిలను మాత్రం నియమించారు. ఇటు పవన్ అటు షర్మిల ఆలోచనలు చూస్తుంటే ఇద్దరు కూడా పైన చెప్పిన జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. చూడబోతుంటే తెలంగాణాలో రేపటి ఎన్నికల్లో పవన్-షర్మిల మధ్య ప్రధాన పోటీ ఉండేట్లుంది.

పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ లేదా కేసీయార్ పై ఆరోపణలు, విమర్శలు చేయటానికి పవన్ వెనకాడుతున్న విషయం స్పష్టమైపోతోంది. కానీ ఇంకా పార్టీ పెట్టకుండానే షర్మిల మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు మొదలుపెట్టేశారు. చివరకు ఫాం హౌస్ రాజకీయాల గురించి కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి సీమాంధ్రలే లక్ష్యంగా ఇద్దరు పోటీపడితే జనాలు ఎవరిని ఆధరిస్తారో చూడాలి.

Satya

Recent Posts

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

27 minutes ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

44 minutes ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

2 hours ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

3 hours ago

వంద దేవుళ్ళు కలిసి హిట్ ఇస్తారా

వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…

3 hours ago

టాక్సిక్ చుట్టూ వలయం బిగుస్తోంది

అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…

4 hours ago