Political News

తిరుప‌తి బ‌రిలో ఓట్ల చీలిక‌.. భారీ వ్యూహానికి వైసీపీ క‌స‌ర‌త్తు!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుస‌గా ఇక్క‌డ విజ‌యం సాధిస్తున్న వైసీపీ.. 2014, 2019 ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట‌ను చేజిక్కించుకుంది. అయితే.. అనూహ్యంగా 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కుడు బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిని వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. తాము ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు, అమ‌లు చేస్తున్న సంక్షేమం.. కేంద్రంతో అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. ఇప్పు డున్న ప‌రిస్థితిలో ఎంతో కొంత వ్య‌తిరేక‌త అయితే.. పార్టీకి ఉంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. తిరుమ‌ల ఆధ్యాత్మిక న‌గ‌రం కావ‌డం.. జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతుండ డం నేప‌థ్యంలో ఇక్క‌డ హిందూ స‌మాజం నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో ఈ వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ కాంగ్రెస్ పార్టీ(బ‌హుశ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఈ పేరు కూడా విని ఉండ‌రు)ని ఇక్క‌డ పోటీకి దింపేలా తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డికి అత్యంత విన‌య విధేయుడిగా గుర్తింపు పొందిన మూలింటి మారెప్ప‌ను తిరుప‌తి బ‌రిలో నిల‌బ‌డేలా ప్రోత్స‌హిస్తు న్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో వైఎస్ ప్ర‌భుత్వంలో మూలింటి మారెప్ప మంత్రిగా కూడా ప‌నిచేశారు. క‌ర్నూలు జిల్లా ఆలూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు విజ‌యం సాదించిన ఆయ‌న రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.

అయితే.. ఇప్పుడు మాత్రం తిరుప‌తి ఉప ఎన్నిక‌లో తాను పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు మారెప్ప తాజాగా వెల్ల‌డించారు. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా గుర్తింపు పొందిన మారెప్ప‌.. తాజాగా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం.. అనూహ్యంగా తిరిగి రాజ‌కీయాల్లోకి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇదంతా కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చి.. తాము గెలుపు గుర్రం ఎక్కేందుకు దోహ‌ద‌ప‌డేలా వైసీపీ నేతలు వ్యూహాత్మ‌కంగా క‌దుపుతున్న పావేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

This post was last modified on March 13, 2021 11:54 am

Share

Recent Posts

మూడేళ్ల ముందు 100 కోట్లు… ఇప్పుడు 3 కోట్లు

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…

29 minutes ago

ఏపీలో ఉద్యోగాల పండగ

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేల‌కుపైగా స‌ర్కారీ…

5 hours ago

తెలంగాణ సర్… కాంగ్రెస్ లేట్ చేసిందా?

తెలంగాణ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రిజ‌విజ‌న్(స‌ర్‌) ప్ర‌క్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు…

5 hours ago

అసలు గుడ్ న్యూస్ ఎప్పుడు నిఖిల్

టాలీవుడ్ లో కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల సంకట స్థితి అంతా ఇంతా కాదు. విడుదల తేదీ తేల్చకుండా, అభిమానుల…

9 hours ago

రామ్ పోతినేని 23… ఊహించని ఆర్టిస్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఇటీవలే పుదుచెరి షెడ్యూల్…

10 hours ago

వంశీని జగన్ దూరం పెడుతున్నారా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత…

10 hours ago