మాజీమంత్రి, విశాఖ ఉత్తరం టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు విచిత్రమైన లాజిక్ లేవదీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్నీ పార్టీలు రెడీ అవ్వాలన్నారు. అందరు రాజీనామాలు చేయాలని గంటా చెప్పారు. 175 మంది ఎంఎల్ఏలు, 25 ఎంపీలు, ఎంఎల్సీలందరు వెంటనే రాజీనామాలు చేయాలని సూచించారు. తాము చెప్పినట్లుగా అందరు రాజీనామాలు చేస్తే యావత్ దేశం మనవైపే చూస్తుందని చెప్పారు. అందరు రాజీనామాలు చేస్తేనే ఉపయోగం ఉంటుందని చెప్పటం కూడా కరెక్టేనేమో.
కానీ తర్వాత చెప్పిన మాటే విచిత్రంగా ఉంది. ఇంతకీ అదేమిటంటే వైసీపీ సభ్యులు రాజీనామాలు చేసిన చోట్ల తెలుగుదేశంపార్టీ పోటీ పెట్టదని అచ్చెన్న, గంటా చెప్పారు. అసలు ఈ మాట చెప్పటానికి గంటాకున్న అర్హత ఏమిటనేదే సందేహం. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సింది గంటా కాదు చంద్రబాబునాయుడు. అలాంటిది ఏ పార్టీలో ఉన్నారో కూడా స్పష్టత లేని గంటా చెబితే నమ్మేవాళ్ళెవరు లేరు.
ఇక గంటా చెప్పిందే నిజమని కాసేపు అనుకుందాం. ఇపుడు రాజీనామా చేసిన స్ధానాలకు ఎన్నికలు జరిగినపుడు టీడీపీ పోటీ పెట్టదన్నారు. అంటే వైసీపీ సభ్యులు చేసే రాజీనామాలు ఆమోదం పొంది తర్వాత ఉపఎన్నికలు జరిగితే అప్పుడు టీడీపీ పోటీ పెట్టదట. టీడీపీ పోటీ పెట్టదు బాగానే ఉంది మరి బీజేపీ+జనసేన మాటేమిటి ? కాంగ్రెస్, వామపక్షాలు కూడా పోటీకి దూరంగా ఉంటాయా ?
పోనీ గంటా మాట మీద గౌరవం ఉంచి పై పార్టీలు కూడా దూరంగా ఉండి వైసీపీ అభ్యర్ధులనే గెలిపిస్తాయని అనుకుందాం. అంటే ఎలాంటి పోటీ లేకుండానే వైసీపీ అభ్యర్ధులు మళ్ళీ గెలుస్తారు. మరలాంటపుడు ఇపుడు రాజీనామాలు చేసి పోటీలేకుండా పోటీ చేసి మళ్ళీ గెలవటం ఎందుకు ? ఇపుడు రాజీనామాలు చేయకుండా ఉంటే అసలు ఉపఎన్నికల అవసరమే ఉండదు కదా. గంటా చెప్పినట్లే టీడీపీ పోటీ పెట్టకపోయినా మరి టీడీపీ పోటీ చేసే స్ధానాల్లో వైసీపీ పోటీ చేయకుండా ఉంటుందా ? ఏదో నోటికొచ్చింది మాట్లాడేసినట్లుందే కానీ లాజిక్ ఉపయోగించినట్లు లేదు గంటా మాటలు.
This post was last modified on March 10, 2021 12:43 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…