సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది రిపబ్లిక్ టీవీ. ఏదైనా అంశంపై అదే పనిగా నెగిటివ్ స్టోరీలు టెలికాస్ట్ చేస్తుందని దాని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటే.. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. దాని సంగతి చూసే వరకు వదిలిపెట్టరన్న మాటను రిపబ్లిక్ టీవీని అభిమానించే వారు చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా రిపబ్లిక్ టీవీని.. దాని అధినేత ఆర్నాబ్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా రిపబ్లిక్ టీవీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనాన్ని ప్రసారం చేశారన్నారు. మార్చి నాలుగున జగన్ సన్నిహితుడిపై ఫేక్ న్యూస్ ను టెలికాస్ట్ చేశారన్నారు. ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. జాతీయ మీడియా ముసుగులో తప్పుడు వార్తల్నిప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.
తప్పుడు వార్తలపై న్యాయపరంగా కోట్లాడతామన్న ఆయన.. ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆదరాభిమానాలు ఉన్న ప్రజా ప్రభుత్వంపై రిపబ్లిక్ టీవీ కత్తి కట్టిందన్నారు. దీని వెనుక ఎవరున్నారో అందరికి తెలుసన్నారు. వైసీపీలో ఎలాంటి గందరగోళం కానీ.. సంక్షోభం కానీ లేవని తేల్చేశారు. విపక్ష నేత చంద్రబాబు కోసమే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
గతంలోనూ నంద్యాల ఉప ఎన్నికను నిర్వహించిన సందర్భంలోనూ ఇదే తీరును రిపబ్లిక్ టీవీ ప్రదర్శించిందని సజ్జల గుర్తు చేశారు. ప్రజలపై బాబు అక్రోశం.. మహిళా కార్యకర్తపై అశోక్ గజపతి చేయి చేసుకున్న వార్తల్ని టెలికాస్ట్ చేయకుండా ప్రభుత్వంపై బురద జల్లే కథనాల వెనుక ఎవరున్నారో అందరికి తెలుసన్నారు. వివాదాల్లో ఉండే ఆర్నాబ్.. జాతికి పట్టిన పీడగా సజ్జల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరి.. ఈ వ్యాఖ్యలకు ఆర్నాబ్ ఏమని బదులిస్తారో చూడాలి.
కొసమెరుపు – దేశమంతటా రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గురించి, అతనికి బీజేపీ పెద్దలకు దేశ రహస్యాలు పంచుకునే సాన్నిహిత్యం ఉందన్న విషయమూ ఇటీవలే బట్టబయలు అయిన విషయమూ తెలుసు. దేశ రహస్యాలు కూడా తెలుసుకునేంత సాన్నిహిత్యం బీజేపీ పెద్దలతో ఉన్న ఉన్న అర్నాబ్ చంద్రబాబు ఫ్రెండ్ ఎలా అవుతాడో మరి.
This post was last modified on March 9, 2021 11:16 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…