రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించాలని.. పార్టీని పుంజుకునేలా చేయాలని… చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ప్రయాస పడుతున్నారు. రోడ్ షోలు నిర్వ హిస్తున్నారు. గెలిచి తీరాలనే లక్ష్యంతో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. గెలిచే అవకాశం ఉన్న నగర మునిసిపాలిటీల్లో ఇప్పుడు తప్పటడుగులు పడు తున్నాయి. ఇలాంటి చాలానే ఉన్నాయని.. అంచనాలు వస్తున్నా… ఇటు చంద్రబాబు కానీ.. అటు లోకేష్ కానీ… ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు. మరి రీజనేంటి? ఎందుకు ఇలా జరుగుతోంది.
ఉదాహరణకు.. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం, అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం లోని మునిసిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీకి చాలా ఎడ్జ్ ఉంది. ఇక్కడ వైసీపీ నేతలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు.. పెద్దగా ప్రజాదరణను పొందలేక పోతున్నారనేది వాస్తవం. అదేసమయంలో ఇక్కడ అభివృద్ధి కూడా గడిచిన రెండేళ్లలో ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా పెద్దగా లేదు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పుంజుకునే అవకాశం మెండుగా ఉంది. అయితే.. ఇక్కడి టీడీపీ కీలక నేతలకు నైతికంగా మద్దతు ఇచ్చే వారు కనిపించడం లేదు. వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.. దూకుడు బాగానే ఉన్నా… కలిసి వచ్చే నాయకులు కనిపించడం లేక… ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు..
ఇక, కదిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ కూడా ఎదురీత ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. కలిసి వచ్చే నాయకులు కనిపించడం లేదు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో గెలిచిన చాంద్ బాషా.. వైసీపీని కాదని.. టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారు. పేరుకు మాత్రం టీడీపీలో ఉన్నారు. మిగిలిన నేతలు కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని.. అధికార పార్టీతో కుమ్మక్కయ్యారనే వాదన వినిపిస్తోంది.
అలా కాకుండా కొంచెం కష్టపడితే… ఈ రెండు మునిసిపాలిటీలు టీడీపీ ఖాతాలో పడే అవకాశం మెండుగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. అదేసమయంలో పార్టీ అదినేత చంద్రబాబు , మాజీ మంత్రి లోకేష్లు ఇలాంటి గెలుపు అవకాశం ఉన్న మునిసిపాలిటీలపై దృష్టి పెడితే.. సునాయాశంగా విజయం సాధించవచ్చనేది పరిశీలకుల భావన.
This post was last modified on March 8, 2021 3:47 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…