తమిళనాడు ఎన్నికల్లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. డీఎంకే యువజన విభాగం ప్రదాన కార్యదర్శి, డీఎంకే చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితవుతున్నారు. ఒకవైపు సినిహీరోగా మరోవైపు రాజకీయ నేతగా ఉదయనిధి మంచి జోరు మీదున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో చెన్నైలోని థౌజండ్ లైట్స్ లేదా చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ స్దానాల్లో ఏదో ఒకచోట నుండి పోటీ చేయాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా పార్టీ అధిష్టానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. దరఖాస్తు ఆధారంగా ఉదయనిధిని పార్టీ చీఫ్ ఇంటర్వ్యూ కూడా చేశారు. పై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి ఉదయనిధికి ఉన్న అర్హతలపై ఇంటర్య్యూలో చర్చ కూడా జరిగింది. అయితే చివరకు ఉదయనిధి పోటీకి చీఫ్ నిరాకరించారు. ప్రధాన కార్యదర్శి అడిగినట్లుగా ఎక్కడ కూడా టికెట్ ఇవ్వటం సాధ్యం కాదని స్టాలిన్ తేల్చి చెప్పారు.
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయనిధిని పోటీలో నుండి తప్పిస్తున్నట్లు చీఫ్ ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసి గెలిపించే బాధ్యతను మాత్రం మోపారు. ఎందుకంటే సినీ సెలబ్రిటీ, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉదయనిధిపై అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాల్సిన అవసరం ఎక్కువుందని పార్టీ చెప్పింది.
ఒకవేళ ఉదయనిధి పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతారని పార్టీ భావించిందట. అదే పోటీ చేయకపోతే పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసే అవకాశం ఉంటుందని చీఫ్ అనుకున్నారట. అందుకనే టికెట్ నిరాకరించి ప్రచార బాధ్యతలను మోపారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. మొదటిది కొడుకుకే టికెట్ నిరాకరించారనే సిగ్నల్ పార్టీ, ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది. ఇక రెండోది మొహమాటాలకు పోయి నేతలకు టికెట్ కేటాయించాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి పార్టీ చీఫ్ కొడుక్కు వ్యూహాత్మకంగానే టికెట్ నిరాకరించారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…