కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది కర్ణాటక రాసలీలల కేసు. తన దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చిన మహిళనను మోసం చేసి.. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేశ్ జార్కిహోళిపై కంప్లైంట్ చేయటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు బీజేపీ అధినాయకత్వం ఒత్తిడితో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.
ఈ సీడీలోని మహిళ కనిపించకపోవటం ఒక ఎత్తు అయితే.. మరికొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బ్లాక్ మొయిల్ చేస్తున్నట్లుగా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సీడీ వ్యవహారాన్ని వెలుగులోకి తీసకొచ్చిన సామాజిక కార్యకర్త దినేశ్ తాను పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ను వెనక్కి తీసుకున్నారు.
తాజాగా తన న్యాయవాదితో వచ్చిన దినేశ్.. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. మంత్రులపై దినేశ్ కుట్రలు చేస్తున్నారని ఒకవైపు.. మరోవైపు డీల్ కుదుర్చుకొని బ్లాక్ మొయిల్ చేస్తున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపణలు చేయటంతో తాను విసిగిపోయినట్లుగా ఆయన పేర్కొన్నారు. అందుకే తాను కేసును వెనక్కి తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు.
సంచలనంగా మారిన సీడి వ్యవహారం ఇప్పుడు కంప్లైంట్ నే వెనక్కి తీసుకోవటంతో.. ఈ ఉదంతాన్ని కేసు కట్టలేదని పోలీసులు చెబుతున్నారు. సీడీలోని మహిళ మొదట కనిపించకపోవటం..కంప్లైంట్ చేసిన సామాజికవేత్త వెనక్కి తగ్గటం చూస్తే.. కనిపించని వ్యవహారం ఏదో తెర వెనుక పెద్ద ఎత్తున జరుగుతుందన్న భావన వకలుగక మానదు.
This post was last modified on March 8, 2021 1:13 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…