Political News

వైసీపీపై ప‌వ‌న్ పంచ్‌లు..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అధికార పార్టీ వైసీపీపై పొలిటిక‌ల్ పంచ్‌లు విసిరారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మునిసిప‌ల్, కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓటేయొద్దంటూ పిలుపునిచ్చారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న పెద్ద‌గా ఏపీపై దృష్టి సారించింది లేదు. అడ‌పా ద‌డ‌పా.. ఆయ‌న అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, పంచాయతీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించారు. యువ‌త ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఆగ‌డాల‌కు చెక్ పెట్టాల‌ని అధికారుల‌కు విన్న‌వించారు. ప్ర‌జ‌లే తిర‌గ‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు.

అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా ప‌వ‌న్‌.. వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏపీలో హిట్ల‌ర్ పాల‌న కొన‌సాగుతోంద‌ని ఫైర్ అయ్యారు. అయితే.. హిట్ల‌ర్ ‌ను చూసిన ప్ర‌పంచం ముందు మీరెంత మీ బ్ర‌తుకులెంత‌.. అని వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని.. ప్ర‌జ‌లు త‌న్ని త‌రిమేసే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తి ఒక్క‌రూ విజ్ఞ‌త‌తో ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. ఇక‌, అధికార యంత్రాంగం కూడా ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డాల‌ని సూచించారు. ఇది అధికారుల‌ నైతిక బాధ్య‌త‌గా ప‌వ‌న్ పేర్కొన్నారు. కుల రాజ‌కీయాల‌తో అంట‌కాగొద్దని అధికారుల‌కు పిలుపునిచ్చారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల జ‌న‌సేన గెలుపొందింద‌ని… ఇప్పుడు కూడా అదే స్థాయిలో మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని ప‌వ‌న్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. వైసీపీకి మాత్రం ఓటేయొద్ద‌ని ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. వైసీపీ వారికి ఓటేస్తే యాచించే స్థాయికి తెస్తున్నారని మండిప‌డ్డారు. వైసీపీ పంచాయితీ ఎన్నికల కంటే 10 రెట్లు దాష్టీకానికి మున్సిపల్ ఎన్నికల్లో పాల్పడిందని.. ఎక్క‌డిక‌క్క‌డ బెదిరింపులు, దౌర్జ‌న్యాల‌ను ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని.. అన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లే వైసీపీ నేత‌ల‌కు బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే.. మునిసిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ప‌వ‌న్ సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ప‌వ‌న్ పిలుపు ఏమేర‌కు ఫ‌లితం ఇస్తుందో చూడాలి.

This post was last modified on March 6, 2021 11:04 pm

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

33 minutes ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

4 hours ago