‘‘అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ’’.. ఈ హెడ్డింగ్తో ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు చూశాం. యూట్యూబ్లోకి వెళ్తే బోలెడన్ని వీడియోలు కూడా దర్శనమిస్తాయి. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా బాలయ్య ఏమీ పెద్దగా పట్టించుకోడు. అభిమానా.. కార్యకర్తా.. మరో వ్యక్తా అన్నది అనవసరం.. బయటికి వచ్చినపుడు ఆయన దగ్గర తేడాగా ప్రవర్తిస్తే చేతులు ఊరుకోవు. ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు బహిరంగ ప్రదేశాల్లో కూడా అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు బోలెడున్నాయి.
తాజాగా బాలయ్య మరోసారి తన చేతి దురుసు చూపించాడు. ఒక అభిమానిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిపై చేయి చేసుకున్నాడు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఈ ఉదంతం చోటు చేసుకోవడం గమనార్హం.
ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ గుర్తుతో ఆ ఎన్నికలు జరగవు కాబట్టి బాలయ్య ఆ సమయంలో నియోజకవర్గంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐతే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని రోజులుగా బాలయ్య హిందూపురంలోనే ఉండి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా పార్టీ లోకల్ ఆఫీసులో కార్యర్తలు, అభిమానులను కలుసుకున్న సందర్భంగా ఒక వ్యక్తి దూకుడుగా వ్యవహరించాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది. అతడి మీద చేయి చేసుకున్నాడు. ఒకసారి కొట్టి వెనక్కి తగ్గాక.. మళ్లీ అతడి మీదికి బాలయ్య దూసుకెళ్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఆయన తీవ్ర ఆగ్రహంతోనే దర్శనమిచ్చాడా వీడియోలో. దీంతో బాలయ్యా ఇదేం పనయ్యా అంటూ మరోసారి ఆయన మీద నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఆ అభిమాని కూడా ఈ నందమూరి హీరో గతంలో అన్నట్లు.. ఆయన చేయి తన ఒంటిని తాకడమే గొప్ప విషయం అని మురిసిపోతాడా?
This post was last modified on March 6, 2021 8:43 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…