‘‘అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ’’.. ఈ హెడ్డింగ్తో ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు చూశాం. యూట్యూబ్లోకి వెళ్తే బోలెడన్ని వీడియోలు కూడా దర్శనమిస్తాయి. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా బాలయ్య ఏమీ పెద్దగా పట్టించుకోడు. అభిమానా.. కార్యకర్తా.. మరో వ్యక్తా అన్నది అనవసరం.. బయటికి వచ్చినపుడు ఆయన దగ్గర తేడాగా ప్రవర్తిస్తే చేతులు ఊరుకోవు. ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు బహిరంగ ప్రదేశాల్లో కూడా అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు బోలెడున్నాయి.
తాజాగా బాలయ్య మరోసారి తన చేతి దురుసు చూపించాడు. ఒక అభిమానిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిపై చేయి చేసుకున్నాడు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఈ ఉదంతం చోటు చేసుకోవడం గమనార్హం.
ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ గుర్తుతో ఆ ఎన్నికలు జరగవు కాబట్టి బాలయ్య ఆ సమయంలో నియోజకవర్గంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐతే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని రోజులుగా బాలయ్య హిందూపురంలోనే ఉండి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా పార్టీ లోకల్ ఆఫీసులో కార్యర్తలు, అభిమానులను కలుసుకున్న సందర్భంగా ఒక వ్యక్తి దూకుడుగా వ్యవహరించాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది. అతడి మీద చేయి చేసుకున్నాడు. ఒకసారి కొట్టి వెనక్కి తగ్గాక.. మళ్లీ అతడి మీదికి బాలయ్య దూసుకెళ్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఆయన తీవ్ర ఆగ్రహంతోనే దర్శనమిచ్చాడా వీడియోలో. దీంతో బాలయ్యా ఇదేం పనయ్యా అంటూ మరోసారి ఆయన మీద నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఆ అభిమాని కూడా ఈ నందమూరి హీరో గతంలో అన్నట్లు.. ఆయన చేయి తన ఒంటిని తాకడమే గొప్ప విషయం అని మురిసిపోతాడా?
This post was last modified on March 6, 2021 8:43 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…