‘‘అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ’’.. ఈ హెడ్డింగ్తో ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు చూశాం. యూట్యూబ్లోకి వెళ్తే బోలెడన్ని వీడియోలు కూడా దర్శనమిస్తాయి. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా బాలయ్య ఏమీ పెద్దగా పట్టించుకోడు. అభిమానా.. కార్యకర్తా.. మరో వ్యక్తా అన్నది అనవసరం.. బయటికి వచ్చినపుడు ఆయన దగ్గర తేడాగా ప్రవర్తిస్తే చేతులు ఊరుకోవు. ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు బహిరంగ ప్రదేశాల్లో కూడా అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు బోలెడున్నాయి.
తాజాగా బాలయ్య మరోసారి తన చేతి దురుసు చూపించాడు. ఒక అభిమానిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిపై చేయి చేసుకున్నాడు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఈ ఉదంతం చోటు చేసుకోవడం గమనార్హం.
ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ గుర్తుతో ఆ ఎన్నికలు జరగవు కాబట్టి బాలయ్య ఆ సమయంలో నియోజకవర్గంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఐతే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని రోజులుగా బాలయ్య హిందూపురంలోనే ఉండి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా పార్టీ లోకల్ ఆఫీసులో కార్యర్తలు, అభిమానులను కలుసుకున్న సందర్భంగా ఒక వ్యక్తి దూకుడుగా వ్యవహరించాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది. అతడి మీద చేయి చేసుకున్నాడు. ఒకసారి కొట్టి వెనక్కి తగ్గాక.. మళ్లీ అతడి మీదికి బాలయ్య దూసుకెళ్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఆయన తీవ్ర ఆగ్రహంతోనే దర్శనమిచ్చాడా వీడియోలో. దీంతో బాలయ్యా ఇదేం పనయ్యా అంటూ మరోసారి ఆయన మీద నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఆ అభిమాని కూడా ఈ నందమూరి హీరో గతంలో అన్నట్లు.. ఆయన చేయి తన ఒంటిని తాకడమే గొప్ప విషయం అని మురిసిపోతాడా?
This post was last modified on March 6, 2021 8:43 pm
సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి.…
దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన…
ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు.…
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…