Political News

జాతీయ కమిటిలో చంద్రబాబు

మొత్తానికి చంద్రబాబునాయుడు విషయంలో కేంద్రప్రభుత్వం కాస్త సానుకూలంగా స్పందిచినట్లే అనిపిస్తోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఎలా నిర్వహించాలనే విషయంలో సలహాలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం జాతీయస్ధాయిలో ఓ కమిటిని నియమిచింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్లు, జాతీయ పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఉన్న ఈ కమిటిలో తెలుగు వాళ్ళకు కూడా సముచిత స్ధానమే దక్కింది. ముఖ్యమంత్రుల హోదాలో కేసీయార్, జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఉన్నారు. చంద్రబాబుతో పాటు బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, మీడియా అధిపతి రామోజీరావు, భారత్ బయోటెక్ అధినేత కృఫ్ణాఎల్లా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మిథాలీరాజ్ తదితరులున్నారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే మనదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించటం ఏమిటో అర్ధం కావటంలేదు. జాతీయస్ధాయిలో నిర్వహించారంటే అర్ధముంది. కానీ అంతర్జాతీయ స్ధాయిలో ఎలా నిర్వహిస్తారు ? ఒక దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇతర దేశాల్లో ఘనంగా నిర్వహించటం ఏమిటో జనాలకు అర్ధం కావటంలేదు. ఎందుకంటే విదేశాల స్వాతంత్ర్య దినోత్సవాలను మనదేశంలో జరిపిన దాఖలాలు లేవు. ఢిల్లీలోని వివిధ దేశాల రాయబార కార్యాలయాల్లో మాత్రమే సదరు దేశాల స్వాతంత్రవ్య దినోత్సవాలను నిర్వహిస్తున్నారు.

కేంద్రప్రభుత్వం 259 మందితో తాజాగా నియమించిన ఉన్నతస్ధాయి కమిటికి ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి మళ్ళీ మోడికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. అలాంటిది ఇపుడు కేంద్రమే తనంతట తానుగా ఉన్నతస్ధాయి కమిటిలో చంద్రబాబుకు అవకాశం ఇవ్వటం గమనార్హం. మరి ఇంతమందికి చోటు కల్పించిన కేంద్రం సెలబ్రిటి+జనసేన అధినేత+మిత్రపక్షమైన పవన్ కల్యాణ్ కు ఎందుకు చోటు కల్పించలేదో.

This post was last modified on March 6, 2021 10:18 am

Share
Show comments
Published by
satya

Recent Posts

దర్శకుల ఉత్సవంలో ఊహించని మెరుపులు

మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…

30 mins ago

వారికి గాజు గ్లాసు గుర్తు ఎలా కేటాయిస్తారు?:  హైకోర్టు సీరియ‌స్‌

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాన పార్టీ జ‌న‌సేన‌కు కేటాయించిన గాజు గ్లాసు…

1 hour ago

కేసీఆర్ పోస్టులకు ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ !

లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ విషయం పెరిగి పెద్దదై…

2 hours ago

వీరమల్లు హఠాత్తుగా ఎందుకు వస్తున్నట్టు

నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…

3 hours ago

ఆ ఒక్కటి ఇచ్చేయండి ప్లీజ్

అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది.  చాలా…

4 hours ago

ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే…

5 hours ago