మీడియా మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నంత కాలంలో అసత్యాల ప్రచారం చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిందో.. లెక్కలు పూర్తిగా మారిపోయాయి. నిజాల కంటే అబద్ధాల ప్రచారమే ఎక్కువైంది. అసత్యాల్ని సత్యాలుగా భ్రమించేలా పోస్టులు సిద్ధం చేయటం.. ఆడియో.. వీడియోలను తమకు అనుకూలంగా మార్ఫింగ్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. అందరూ అసత్యాల ప్రచారానికి బలి అవుతుంటారు. ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
తాజాగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ను తీసుకొచ్చారు. దాని ట్విట్టర్ ఖాతాను కూడా తాజాగా ప్రారంభించారు. మీడియాలో.. సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్న వాటికి సంబంధించిన తప్పుడు వివరాల్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందట. సాక్ష్యాధారాలతో సహా నిజం చూపిస్తారని… నిజం ఏమిటో.. అబద్ధం ఏమిటో చూపించటమే ఏపీ ఫ్యాక్ట్ చెక్ ముఖ్య ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు.
ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేపడితే.. అదెక్కడి నుంచి మొదలైందో గుర్తించి.. దానిపై చట్టప్రాకరం చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఒక వ్యక్తి ప్రతిష్ఠను.. వ్యవస్థ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదని.. వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే కార్యక్రమాలపైనా. వ్యవస్థలపైనా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పలు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అలాంటి వాటికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతో తామీ వేదికను సిద్ధం చేసినట్లుగా సీఎం జగన్ చెప్పారు. అసత్యాల్ని ప్రచారం చేసే వారికి ఇక చుక్కలే.
This post was last modified on March 5, 2021 7:40 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…