అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతికత పుణ్యమా అని ఇప్పటివరకు ఊహలకు పరిమితమైన అంశాలు వాస్తవరూపం దాలుస్తున్నాయి. అలాంటిదే ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. అల్లంత దూరాన ఉన్న ఆకాశం వంక ఆశగా చూసే వారి ఆశల్ని తీర్చేందుకు ఒక సంస్థ సిద్ధమవుతోంది. అంతరిక్షంలో హోటల్ నిర్మించేందుకు రెఢీ అవుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అంతరిక్షంలోకి అతిధుల్ని ఆహ్వానించటానికి ఒక హోటల్ సిద్ధంగా ఉండనుంది.
ఒకప్పుడు అంతరిక్షానికి వెళ్లి వస్తున్నారంటే అదో అద్బుతమన్నట్లుగా ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష యాత్ర సామాన్యులకు పరిచయం చేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్భిటల్ అసెంబ్లీ అనే సంస్థ అంతరిక్షంలో స్టార్ హోటల్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భూమికి రెండు వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలోఈ హోటల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఈ కక్ష్యలోనే అమెరికా.. జపాన్.. రష్యా.. యూరప్.. కెనడా కలిపి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించటం తెలిసిందే. ఇక్కడే హోటల్ ను కూడా ఏర్పాటు చేయాలని సదరు సంస్థ భావిస్తోంది. 2025లో నిర్మాణం ప్రారంభించి.. 2027లో అందుబాటులోకి తీసుకురావాలన్నది వారి ఆలోచన. ఇందులో స్పా.. సినిమాహాల్.. జిమ్.. లైబ్రరీ.. సంగీత కార్యక్రమంతో పాటు అంతరిక్షం నుంచి భూమిని చూసే విదంగా లాంజ్ లు.. బార్.. 400 మందికి సరిపడా గదులు ఉండనున్నాయి.
అంతరిక్షంలో వేలాడుతూ.. తిరుగుతూ ఉండే ఈ హోటల్ ప్రతి 90 నిమిషాలకు ఒక భ్రమణం పూర్తి చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు భూమ్యాకర్షనును క్రత్రిమంగా క్రియేట్ చేయనున్నారు. ఇది చంద్రుడిపై ఉండేభూమ్యాకర్షణతో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాద.. ఇక్కడ గెస్టుహౌస్ లు కూడా ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చూస్తుంటే.. 2027 వరకు వెయిట్ చేయగలిగితే.. సరికొత్త డేట్ కు ఇంతకుమించిన ఆప్షన్ వేరేది ఉండదేమో?
This post was last modified on March 4, 2021 5:39 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…