ఈ మాజీ ఎంఎల్ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఇలాగే ఉంటుంది. దెందులూరు మాజీ ఎంఎల్ఏ, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఏలూరు కార్పొరేషన్ 23వ డివిజన్లో చింతమనేని జనసేన పార్టీ అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు. ఏలూరులోని టీడీపీ సీనియర్ నేతలు తమ పార్టీ అభ్యర్ధుల తరపున మాత్రమే ప్రచారం చేస్తుంటే చింతమనేని మాత్రం జనసేనకు ప్రచారం చేయటం కలకలం సృష్టిస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే ఏలూరు కార్పొరేషన్లోని 23వ డివిజన్లో టీడీపీ తరపున ఓ నేత నామినేషన్ వేశారు. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దాంతో ఈ వార్డులో టీడీపీ తరపున అభ్యర్ధి లేకుండాపోయారు. ఇదే విషయం టీడీపీ సీనియర్ నేతల్లో చర్చకు వచ్చింది. చేయగలిగేదేమీ లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు.
అయితే చింతమనేని మాత్రం ఊరుకోలేదు. తమ పార్టీ అభ్యర్ధి ఎలాగు లేరు కాబట్టి, వైసీపీకి డివిజన్ను వదిలేయటం ఇష్టంలేకపోయింది. అందుకనే పోటీలో ఉన్న జనసన అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చింతమనేనే చెప్పుకున్నారు. టీడీపీ అభ్యర్ది లేరు కాబట్టి జనసేన నేతలను వెంటేసుకుని ప్రచారంలో తిరుగుతున్నట్లు చెప్పారు.
నిజానికి అనధికారికంగా తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మున్సిపాల్ వార్డుల్లో టీడీపీ+జనసేన నేతలు కలిసే ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవలే ముగిసిన పంచాయితి ఎన్నికల్లో కూడా కొన్నిచోట్ల టీడీపీ, జనసేనలు కలిసే పనిచేశాయి. కొన్ని పంచాయితిలు, వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలిచారంటే అందుకు టీడీపీ మద్దతివ్వటమే కారణం. అప్పట్లో అనధికారికంగా జరిగిన సహకారం ఏలూరు కార్పొరేషన్లో బహిరంగంగానే జరుగుతోందంతే.
This post was last modified on March 4, 2021 12:51 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…