Political News

చింతమనేని సంచలన నిర్ణయం

ఈ మాజీ ఎంఎల్ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఇలాగే ఉంటుంది. దెందులూరు మాజీ ఎంఎల్ఏ, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఏలూరు కార్పొరేషన్ 23వ డివిజన్లో చింతమనేని జనసేన పార్టీ అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు. ఏలూరులోని టీడీపీ సీనియర్ నేతలు తమ పార్టీ అభ్యర్ధుల తరపున మాత్రమే ప్రచారం చేస్తుంటే చింతమనేని మాత్రం జనసేనకు ప్రచారం చేయటం కలకలం సృష్టిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఏలూరు కార్పొరేషన్లోని 23వ డివిజన్లో టీడీపీ తరపున ఓ నేత నామినేషన్ వేశారు. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దాంతో ఈ వార్డులో టీడీపీ తరపున అభ్యర్ధి లేకుండాపోయారు. ఇదే విషయం టీడీపీ సీనియర్ నేతల్లో చర్చకు వచ్చింది. చేయగలిగేదేమీ లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు.

అయితే చింతమనేని మాత్రం ఊరుకోలేదు. తమ పార్టీ అభ్యర్ధి ఎలాగు లేరు కాబట్టి, వైసీపీకి డివిజన్ను వదిలేయటం ఇష్టంలేకపోయింది. అందుకనే పోటీలో ఉన్న జనసన అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చింతమనేనే చెప్పుకున్నారు. టీడీపీ అభ్యర్ది లేరు కాబట్టి జనసేన నేతలను వెంటేసుకుని ప్రచారంలో తిరుగుతున్నట్లు చెప్పారు.

నిజానికి అనధికారికంగా తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మున్సిపాల్ వార్డుల్లో టీడీపీ+జనసేన నేతలు కలిసే ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవలే ముగిసిన పంచాయితి ఎన్నికల్లో కూడా కొన్నిచోట్ల టీడీపీ, జనసేనలు కలిసే పనిచేశాయి. కొన్ని పంచాయితిలు, వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలిచారంటే అందుకు టీడీపీ మద్దతివ్వటమే కారణం. అప్పట్లో అనధికారికంగా జరిగిన సహకారం ఏలూరు కార్పొరేషన్లో బహిరంగంగానే జరుగుతోందంతే.

This post was last modified on March 4, 2021 12:51 pm

Share
Show comments

Recent Posts

అభిమాన హీరోను కొట్టాల్సిన వేళ..

సినిమాల్లోకి వచ్చే ముందు అందరు నటులకు అభిమాన తారలని ఉంటారు. వాళ్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినపుడు…

13 hours ago

యాడ్స్ ఉచ్చులో స్టార్ సెలబ్రిటీలు

ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్లు వాటి తరఫున యాడ్స్ చేయడం సహజం. సదరు కంపెనీల ఉత్పత్తులు వీళ్ళు…

14 hours ago

జగన్ స్పీచ్‌లో వివేకా రెండో పెళ్లి

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకా…

15 hours ago

అటు హీరో వెంక‌టేశ్‌కు.. ఇటు పొంగులేటికి వియ్యంకుడు

రామస‌హాయం ర‌ఘురాం రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఇది. ఎంతో ఉత్కంఠ నెల‌కొన్న ఖ‌మ్మం…

16 hours ago

ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలా

ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా పులివెందుల‌లో నిర్వ‌హించిన స‌భ‌లో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌.. వైఎస్ ష‌ర్మిల‌పై తీవ్ర…

16 hours ago

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్

క‌రీంన‌గ‌ర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల‌ని భావించిన తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌కు ఆ టికెట్ ద‌క్క‌క‌పోయినా…

16 hours ago