Political News

సౌత్ వారు తెగ తాగేస్తున్నారట

ఉత్తరాది.. దక్షిణాది అంటూ తరచూ వినిపించే వాదనల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన ఒక ఆసక్తికర నివేదిక ఒకటి బయటకు వచ్చింది. క్రిసిల్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నార్త్ తో పోలిస్తే సౌత్ లోనే మద్య వినియోగం ఎక్కువని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా చూస్తే.. మద్య వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్న వైనం బయటకు వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటివేళలో దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు తక్కువేనని చెబుతున్నారు. దీనికి కారణం మద్యం అమ్మకాల కారణంగా వచ్చే ఆదాయమని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా వినియోగించే మద్యంలో 45 శాతం దక్షిణాది రాష్ట్రాల వారే వినియోగిస్తారన్న చేదు నిజం బయటకు వచ్చింది. సౌత్ లోని ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో మద్య వినియోగం ఎక్కువేనని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఆయా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పది నుంచి పదిహేను శాతం వరకూ మద్యం అమ్మకాల ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు చెప్పింది.

ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో మందు తాగే వారిని తాగుబోతులంటూ చీప్ గా మాట్లాడకూడదని.. చులకనగా చూడకూడదని.. తమను ట్యాక్స్ పేయర్స్ గా గౌరవించాలని చెప్పటం గుర్తుండే ఉంటుంది. నిత్యం.. ఏ మాత్రం క్రమం తప్పకుండా టాక్స్ పే చేసే ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మందుబాబులేనన్న మాటలు.. తాజా రిపోర్టులోని అంశాల్ని చూస్తే గుర్తుకు రాక మానదు.

This post was last modified on May 9, 2020 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

60 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago