Political News

సౌత్ వారు తెగ తాగేస్తున్నారట

ఉత్తరాది.. దక్షిణాది అంటూ తరచూ వినిపించే వాదనల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన ఒక ఆసక్తికర నివేదిక ఒకటి బయటకు వచ్చింది. క్రిసిల్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నార్త్ తో పోలిస్తే సౌత్ లోనే మద్య వినియోగం ఎక్కువని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా చూస్తే.. మద్య వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్న వైనం బయటకు వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటివేళలో దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు తక్కువేనని చెబుతున్నారు. దీనికి కారణం మద్యం అమ్మకాల కారణంగా వచ్చే ఆదాయమని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా వినియోగించే మద్యంలో 45 శాతం దక్షిణాది రాష్ట్రాల వారే వినియోగిస్తారన్న చేదు నిజం బయటకు వచ్చింది. సౌత్ లోని ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో మద్య వినియోగం ఎక్కువేనని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఆయా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పది నుంచి పదిహేను శాతం వరకూ మద్యం అమ్మకాల ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు చెప్పింది.

ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో మందు తాగే వారిని తాగుబోతులంటూ చీప్ గా మాట్లాడకూడదని.. చులకనగా చూడకూడదని.. తమను ట్యాక్స్ పేయర్స్ గా గౌరవించాలని చెప్పటం గుర్తుండే ఉంటుంది. నిత్యం.. ఏ మాత్రం క్రమం తప్పకుండా టాక్స్ పే చేసే ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మందుబాబులేనన్న మాటలు.. తాజా రిపోర్టులోని అంశాల్ని చూస్తే గుర్తుకు రాక మానదు.

This post was last modified on May 9, 2020 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

2 hours ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

3 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

3 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

3 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

4 hours ago