Political News

సౌత్ వారు తెగ తాగేస్తున్నారట

ఉత్తరాది.. దక్షిణాది అంటూ తరచూ వినిపించే వాదనల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన ఒక ఆసక్తికర నివేదిక ఒకటి బయటకు వచ్చింది. క్రిసిల్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నార్త్ తో పోలిస్తే సౌత్ లోనే మద్య వినియోగం ఎక్కువని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా చూస్తే.. మద్య వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్న వైనం బయటకు వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటివేళలో దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు తక్కువేనని చెబుతున్నారు. దీనికి కారణం మద్యం అమ్మకాల కారణంగా వచ్చే ఆదాయమని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా వినియోగించే మద్యంలో 45 శాతం దక్షిణాది రాష్ట్రాల వారే వినియోగిస్తారన్న చేదు నిజం బయటకు వచ్చింది. సౌత్ లోని ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో మద్య వినియోగం ఎక్కువేనని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఆయా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పది నుంచి పదిహేను శాతం వరకూ మద్యం అమ్మకాల ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు చెప్పింది.

ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో మందు తాగే వారిని తాగుబోతులంటూ చీప్ గా మాట్లాడకూడదని.. చులకనగా చూడకూడదని.. తమను ట్యాక్స్ పేయర్స్ గా గౌరవించాలని చెప్పటం గుర్తుండే ఉంటుంది. నిత్యం.. ఏ మాత్రం క్రమం తప్పకుండా టాక్స్ పే చేసే ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మందుబాబులేనన్న మాటలు.. తాజా రిపోర్టులోని అంశాల్ని చూస్తే గుర్తుకు రాక మానదు.

This post was last modified on May 9, 2020 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

14 hours ago