Political News

ఉక్కే కాదు పోర్టు కూడా ప్రైవేటు పరమేనా ?

దేశంలోని వివిధ ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మంచి జోరు మీదుంది. తాజాగా జరిగిన మ్యారిటైమ్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడి మాట్లాడుతు దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించబోతున్నట్లు చెప్పారు. అలాగే వీటి ఆధ్వర్యంలో నడుస్తున్న 39 బెర్తులను 2024 ఏడాది చివరకల్లా ప్రైవేటు సంస్ధలతో బాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు స్పష్టం చేశారు.

పోర్టులను ప్రైవేటీకరిచటానికి వీలుగా కేంద్రం తొందరలోనే ప్రైవేటుపోర్టుల అథారిటి చట్టాన్ని అమల్లోకి తేబోతోంది. ఇందులో అనేక పోర్టులతో పాటు విశాఖ పోర్టు కూడా ఉందని సమాచారం. ఇప్పటికే విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్ధకు అప్పగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గడచిన నెలరోజులకు పైగా విశాఖ నగరంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయం వెలుగు చూడగానే ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులతో మొదలైన ఆందోళనకు రాజకీయపార్టీలు కూడా తోడయ్యాయి.

అయితే రాజకీయపార్టీలు ఎన్ని ఆందోళనలు చేసినా పెద్దగా ఉపయోగం కనబడటం లేదు. ఎందుకంటే ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు ప్రైవేటు కంపెనీకి అప్పగించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఉక్కు ప్రైవేటీకరణ ఆగేట్లులేదు. ఒకవైపు ఇది జరుగుతుండగానే తాజాగా విశాఖ పోర్టును కూడా ప్రైవేటుపరం చేయటానికి ఏర్పాట్లు మొదలైందని సమాచారం.

కేంద్రం 2020లోనే మేజర్ పోర్టుల అథారిటి చట్టాన్ని తెచ్చింది. ఇందులో భాగంగానే ఇఫ్పటికే పోర్టుల్లోని కార్యకలాపాలన్నీ కేంద్రం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఇపుడు ప్రాజెక్టుల్లోని ప్రాజెక్టులన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పగించాలని తాజాగా డిసైడ్ అయ్యింది. చట్టంలో భాగంగానే పోర్టులోని వివిధ విభాగాల నిర్వహణకు ప్రైవేటు భాగస్వామ్య కంపెనీలు తగిన రుసుములు వసూలు చేయబోతున్నాయి. ఆదాయ, వ్యయాలను వివిధ దామాషాల్లో పంచుకుంటాయి. ఇపుడు ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యం అంటున్నా మెల్లిగా ప్రభుత్వం తప్పుకుని మొత్తాన్ని ప్రైవేటుకు అప్పగించేస్తుంది.

This post was last modified on March 3, 2021 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

2 hours ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

4 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

5 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

8 hours ago