తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కున్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పే ఆయన.. తన గురించి తాను భలే గొప్పలు చెప్పుకుంటారు. ఏదైనా సీరియస్ ఇష్యూ తెర మీదకు వస్తే.. తాను అలా చేయకుంటే తల కోసుకుంటానని చెప్పేస్తుంటారు. అలా మాటలతో మనసుల్ని ప్రభావితం చేసే కేసీఆర్ కు సూది మందు అంటే చాలా భయం. ఆ మాటకు వస్తే.. ఇంజెక్షన్ చేయాల్సి వస్తే.. ఆయన ఆమడ దూరంలో ఉంటారని చెబుతారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎప్పుడూ లేని విధంగా అదే పనిగా తరచూ ఢిల్లీకి వెళ్లే వారు. అక్కడ రెండు.. మూడు రోజులు ఉండి మళ్లీ వచ్చేసేవారు. ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? ఎందుకు తిరిగి వస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికేవి కావు. చివరకు బయటకు వచ్చిన విషయం ఆయన డాక్టర్ కు చూపించుకోవటానికి వెళుతుండేవారని.. వారు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పినంతనే ఆయన వెనక్కి తగ్గి తిరిగి వచ్చేసే వారని చెబుతారు. చివరకు పలువురు నచ్చజెప్పిన తర్వాత ఇంజక్షన్ కు ఓకే చేసినట్లు చెబుతారు.
అలా సూది మందు అంటే అస్సలు ఇష్టపడని కేసీఆర్.. కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా.. ఆయనఇంజెక్షన్ చేయించుకుంటారా? అన్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. అరవై ఏళ్లు దాటిన అందరికి వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. సూది మందును పెద్దగా ఇఫ్టపడని కేసీఆర్.. కోవిడ్ టీకా మాటేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
వ్యాక్సిన్ రెండో దశలో భాగంగా సోమవారం తెల్లవారుజామునే ప్రధాని మోడీ వ్యాక్సిన్ వేసుకోవటానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం వేళలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వేసుకున్నారు. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఎవరూ పెద్దగా వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరి..సార్ టీకా వేసుకోవటానికి ఓకే అంటారా?
This post was last modified on March 2, 2021 10:30 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…