Political News

మిత్రపక్షాలకు కాలం చెల్లినట్లేనా ?

మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన మధ్య విశాఖ ఉక్కు పెద్ద చిచ్చు పెట్టినట్లు సమాచారం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పొత్తుల విషయంలో తాము పునరాలోచించాల్సుంటుందని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ డైరెక్టుగానే హెచ్చరించారు.

అయితే నాదెండ్ల హెచ్చరికలను కేంద్రం ఏమాత్రం ఖాతరుచేయలేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం మరింత జోరు పెంచింది. ప్రైవేటీకరణ అంశం జోరుగా, సజావుగా జరిగేందుకు మంత్రిత్వ శాఖలతో కమిటిని వేసింది. ఉక్కు ప్రైవేటీకరణ అంశం నుండి వెనక్కు వెళ్ళేది లేదన్నట్లుగా తాజాగా కేంద్ర మరో ప్రకటన చేసింది. తాజా ప్రకటనతో బీజేపీకి మిత్రపక్షంగా ఉండాలో వద్దో తేల్చుకోవాల్సింది జనసేన మాత్రమే.

కేంద్రం తాజా వైఖరి ఒక్క తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో పోయేదికాదు. మరో మూడున్నరేళ్ళు రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వెంటాడుతునే ఉంటుంది. చూడబోతుంటే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయ్యే అవకాశాలు లేవని బీజేపీ అగ్రనేతలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే అనిపిస్తోంది. అందుకనే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ మీద దెబ్బ కొడుతునే ఉంది.

కేంద్రం వైఖరిని కవర్ చేసుకోవటానికి ఇంతకాలం బీజేపీ నేతలు ఏవో కథలు చెబుతు కాలం నెట్టుకొచ్చేశారు. కానీ తాజాగా ఉక్కు ప్రైవేటీకరణ కారణంగా వాళ్ళు చెబుతున్నవి అబద్ధాలని అందరికీ తెలిసిపోయింది. దాంతో సోమువీర్రాజు అండ్ కో కూడా ఏమి మాట్లాడలేక జనాలకు మొహం చాటేస్తున్నారు. అందుకనే తాము చెప్పదలచుకున్న విషయాలను ట్విట్టర్ కే ఎక్కువ పరిమితమైపోయారు. కేంద్రం తాజా ప్రకటనతో జనసేన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో చూడాల్సిందే.

This post was last modified on March 1, 2021 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

12 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

21 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

3 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

4 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

5 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago