మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన మధ్య విశాఖ ఉక్కు పెద్ద చిచ్చు పెట్టినట్లు సమాచారం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పొత్తుల విషయంలో తాము పునరాలోచించాల్సుంటుందని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ డైరెక్టుగానే హెచ్చరించారు.
అయితే నాదెండ్ల హెచ్చరికలను కేంద్రం ఏమాత్రం ఖాతరుచేయలేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం మరింత జోరు పెంచింది. ప్రైవేటీకరణ అంశం జోరుగా, సజావుగా జరిగేందుకు మంత్రిత్వ శాఖలతో కమిటిని వేసింది. ఉక్కు ప్రైవేటీకరణ అంశం నుండి వెనక్కు వెళ్ళేది లేదన్నట్లుగా తాజాగా కేంద్ర మరో ప్రకటన చేసింది. తాజా ప్రకటనతో బీజేపీకి మిత్రపక్షంగా ఉండాలో వద్దో తేల్చుకోవాల్సింది జనసేన మాత్రమే.
కేంద్రం తాజా వైఖరి ఒక్క తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో పోయేదికాదు. మరో మూడున్నరేళ్ళు రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వెంటాడుతునే ఉంటుంది. చూడబోతుంటే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయ్యే అవకాశాలు లేవని బీజేపీ అగ్రనేతలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లే అనిపిస్తోంది. అందుకనే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ మీద దెబ్బ కొడుతునే ఉంది.
కేంద్రం వైఖరిని కవర్ చేసుకోవటానికి ఇంతకాలం బీజేపీ నేతలు ఏవో కథలు చెబుతు కాలం నెట్టుకొచ్చేశారు. కానీ తాజాగా ఉక్కు ప్రైవేటీకరణ కారణంగా వాళ్ళు చెబుతున్నవి అబద్ధాలని అందరికీ తెలిసిపోయింది. దాంతో సోమువీర్రాజు అండ్ కో కూడా ఏమి మాట్లాడలేక జనాలకు మొహం చాటేస్తున్నారు. అందుకనే తాము చెప్పదలచుకున్న విషయాలను ట్విట్టర్ కే ఎక్కువ పరిమితమైపోయారు. కేంద్రం తాజా ప్రకటనతో జనసేన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో చూడాల్సిందే.
This post was last modified on March 1, 2021 7:10 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…