Political News

బెజ‌వాడ‌లో ఆ రెండు సామాజిక వ‌ర్గాలు ఎటు వైపు..?

అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల కాలంలో దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణాల్లో ఈ ఆవేద‌న ఎక్కువ‌గా ఉంది. పైగా వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాలు ఈ విష‌యంలో మ‌రింత బాధ‌ప‌డుతున్నాయి. బెజ‌వాడ‌లో ఈ రెండు సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌. సెంట్ర‌ల్‌లో బ్రాహ్మ‌ణ‌, ప‌శ్చిమ‌లో వైశ్య‌లు ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వీరు ఎవ‌రి వైపు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌నే ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల విష‌యాన్ని తీసుకుంటే.. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు.. ఎమ్మెల్యేగా ఉన్నారు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బ్రాహ్మ‌ణ ఓట్ల కోసం ప్ర‌య‌త్నించిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకున్న దాఖ‌లా లేద‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ కూడా నిర్వీర్యం అయింద‌ని.. ఏ ఒక్క రూపాయి కూడా త‌మ‌కు అంద‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, వైశ్య సామాజిక వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ‌దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ఇదే సామాజిక వ‌ర్గం. పైగా ఆయ‌న గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైశ్య వ‌ర్గానికి అనేక హామీలు ఇచ్చారు. కానీ.. ఈయ‌న మంత్రి అయిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు వైశ్యుల‌తో ఆత్మీయ స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేక పోయారు. ఎక్క‌డ భేటీ అయితే.. వారి స‌మ‌స్య‌లు మ‌ళ్లీ ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అటు మ‌ల్లాదికి, ఇటు వెలంప‌ల్లికి చెల్లింది. కానీ, ఇప్పుడు విజ‌యవాడ కార్పొరేష‌న్‌లో వీరిద్ద‌రూ స‌త్త‌చూపించాలంటే..బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న‌ వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. స‌త్య‌నారాయ‌ణ పురం, మ‌ధురాన‌గ‌ర్‌, దేవీన‌గ‌ర్, అయోధ్య‌న‌గ‌ర్‌ వంటి కీల‌క ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మ‌ణుల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల్సిన అవ‌స‌రం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని వైశ్యుల‌ను త‌న‌కు మ‌ద్ద‌తుగా మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీరిని ఎలా క‌లుస్తారు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనికి రెండు ప్ర‌ధాన అవ‌రోధాలు క‌నిపిస్తున్నాయి. గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు..బ్రాహ్మ‌ణుల‌కు మ‌ల్లాది విష్ణు అనేక హామీలు ఇచ్చారు. అవేవీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు. ఇక‌, మంత్రి వెలంప‌ల్లి.. దేవ‌దాయ శాఖ‌లోని బ్రాహ్మ‌ణుల‌ను వ‌దిలేసి..ఇత‌ర రాజ‌కీయాలు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో వైశ్యుల‌ను రాజ‌కీయంగా విడ‌దీశార‌నే వ్యాఖ్య‌లు కూడా వెలంప‌ల్లి విష‌యంలో వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కార్పొరేష‌న్ కైవ‌సం చేసుకోవ‌డం ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత…

23 minutes ago

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…

1 hour ago

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

6 hours ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

9 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

11 hours ago

చాలామంది పెద్ది పోవాల‌ని కోరుకున్నారు

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా నెగెటివిటీ సినిమాల‌కు ఎంత న‌ష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…

12 hours ago