విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. చేపట్టిన ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో మార్చి 5న బంద్కు కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు పిలుపునివ్వడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమానికి దీనిని పతాక స్థాయిగా పేర్కొంటున్నారు పరిశీలకులు. ఇక, ఈ బంద్ను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పిలుపునిచ్చారు.
ఇక, ఇప్పటికే రాష్ట్రంలో అమరావతి ఉద్యమం పీక్ స్టేజ్లో కొనసాగుతోంది. ఇప్పుడు దీనికి విశాఖ ఉక్కు ఉద్యమం మరింత తీవ్రం కానుంది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బంద్ సాగించడం గమనార్హం. నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత.. అనేక ఉద్యమాలు తెర మీదికి వచ్చాయి. గతంలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం కొన్ని రోజులు అట్టుడికింది. ఇక, తర్వాత.. అమరావతి రాజధాని కోసం.. ప్రజలు దండెత్తుతున్నారు. పైకి కేవలం అమరావతి ప్రాంతానికి మాత్రమే పరిమితమైందని భావించినా.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనో భావాలతో ముడిపడిన వ్యవహారంగా మారింది.
తాజాగా పిలుపు నిచ్చిన విశాఖ బంద్ను ప్రతి పార్టీ కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నా..అన్ని పార్టీలకూ దీనిని సక్సెస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలోనే విశాఖ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతుండడంతో అన్ని పార్టీలకూ ఇక్కడ పాగా వేయాలనే లక్ష్యం ఉన్న నేపథ్యంలో బంద్ను విజయ వంతం చేయాలని భావిస్తున్నాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్కు సహకరించాలని కోరారు. మొత్తంగా చూస్తే.. అమరావతికి-విశాఖకు ఉక్కు ఉద్యమానికి చాలా తేడా కనిపిస్తుండడం గమనార్హం. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 28, 2021 3:55 pm
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…