Political News

5న ఉక్కు ఉద్య‌మం.. రాజుకుంటున్న విశాఖ పోరు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ.. చేప‌ట్టిన ఉద్య‌మం తీవ్ర‌స్థాయికి చేరింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వ‌ర్యంలో మార్చి 5న బంద్‌కు కార్మిక సంఘాలు, రాజ‌కీయ ప‌క్షాలు పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉద్య‌మానికి దీనిని ప‌తాక స్థాయిగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పిలుపునిచ్చారు.

ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్రంలో అమ‌రావ‌తి ఉద్య‌మం పీక్ స్టేజ్‌లో కొన‌సాగుతోంది. ఇప్పుడు దీనికి విశాఖ ఉక్కు ఉద్య‌మం మరింత తీవ్రం కానుంది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే ల‌క్ష్యంగా బంద్ సాగించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.. అనేక ఉద్య‌మాలు తెర మీదికి వ‌చ్చాయి. గతంలో ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రం కొన్ని రోజులు అట్టుడికింది. ఇక‌, త‌ర్వాత‌.. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం.. ప్ర‌జ‌లు దండెత్తుతున్నారు. పైకి కేవ‌లం అమ‌రావ‌తి ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని భావించినా.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌నో భావాల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారంగా మారింది.

తాజాగా పిలుపు నిచ్చిన విశాఖ బంద్‌ను ప్ర‌తి పార్టీ కూడా రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నా..అన్ని పార్టీల‌కూ దీనిని స‌క్సెస్ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే విశాఖ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండడంతో అన్ని పార్టీల‌కూ ఇక్క‌డ పాగా వేయాల‌నే ల‌క్ష్యం ఉన్న నేప‌థ్యంలో బంద్‌ను విజ‌య వంతం చేయాల‌ని భావిస్తున్నాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. మొత్తంగా చూస్తే.. అమ‌రావ‌తికి-విశాఖ‌కు ఉక్కు ఉద్య‌మానికి చాలా తేడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 28, 2021 3:55 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

37 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago