Political News

5న ఉక్కు ఉద్య‌మం.. రాజుకుంటున్న విశాఖ పోరు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ.. చేప‌ట్టిన ఉద్య‌మం తీవ్ర‌స్థాయికి చేరింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వ‌ర్యంలో మార్చి 5న బంద్‌కు కార్మిక సంఘాలు, రాజ‌కీయ ప‌క్షాలు పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉద్య‌మానికి దీనిని ప‌తాక స్థాయిగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పిలుపునిచ్చారు.

ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్రంలో అమ‌రావ‌తి ఉద్య‌మం పీక్ స్టేజ్‌లో కొన‌సాగుతోంది. ఇప్పుడు దీనికి విశాఖ ఉక్కు ఉద్య‌మం మరింత తీవ్రం కానుంది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే ల‌క్ష్యంగా బంద్ సాగించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.. అనేక ఉద్య‌మాలు తెర మీదికి వ‌చ్చాయి. గతంలో ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రం కొన్ని రోజులు అట్టుడికింది. ఇక‌, త‌ర్వాత‌.. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం.. ప్ర‌జ‌లు దండెత్తుతున్నారు. పైకి కేవ‌లం అమ‌రావ‌తి ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని భావించినా.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌నో భావాల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారంగా మారింది.

తాజాగా పిలుపు నిచ్చిన విశాఖ బంద్‌ను ప్ర‌తి పార్టీ కూడా రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నా..అన్ని పార్టీల‌కూ దీనిని స‌క్సెస్ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే విశాఖ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండడంతో అన్ని పార్టీల‌కూ ఇక్క‌డ పాగా వేయాల‌నే ల‌క్ష్యం ఉన్న నేప‌థ్యంలో బంద్‌ను విజ‌య వంతం చేయాల‌ని భావిస్తున్నాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. మొత్తంగా చూస్తే.. అమ‌రావ‌తికి-విశాఖ‌కు ఉక్కు ఉద్య‌మానికి చాలా తేడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 28, 2021 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

3 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

3 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

3 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

4 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

5 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

7 hours ago