Political News

5న ఉక్కు ఉద్య‌మం.. రాజుకుంటున్న విశాఖ పోరు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ.. చేప‌ట్టిన ఉద్య‌మం తీవ్ర‌స్థాయికి చేరింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వ‌ర్యంలో మార్చి 5న బంద్‌కు కార్మిక సంఘాలు, రాజ‌కీయ ప‌క్షాలు పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉద్య‌మానికి దీనిని ప‌తాక స్థాయిగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పిలుపునిచ్చారు.

ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్రంలో అమ‌రావ‌తి ఉద్య‌మం పీక్ స్టేజ్‌లో కొన‌సాగుతోంది. ఇప్పుడు దీనికి విశాఖ ఉక్కు ఉద్య‌మం మరింత తీవ్రం కానుంది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే ల‌క్ష్యంగా బంద్ సాగించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.. అనేక ఉద్య‌మాలు తెర మీదికి వ‌చ్చాయి. గతంలో ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రం కొన్ని రోజులు అట్టుడికింది. ఇక‌, త‌ర్వాత‌.. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం.. ప్ర‌జ‌లు దండెత్తుతున్నారు. పైకి కేవ‌లం అమ‌రావ‌తి ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని భావించినా.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌నో భావాల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారంగా మారింది.

తాజాగా పిలుపు నిచ్చిన విశాఖ బంద్‌ను ప్ర‌తి పార్టీ కూడా రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నా..అన్ని పార్టీల‌కూ దీనిని స‌క్సెస్ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే విశాఖ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండడంతో అన్ని పార్టీల‌కూ ఇక్క‌డ పాగా వేయాల‌నే ల‌క్ష్యం ఉన్న నేప‌థ్యంలో బంద్‌ను విజ‌య వంతం చేయాల‌ని భావిస్తున్నాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. మొత్తంగా చూస్తే.. అమ‌రావ‌తికి-విశాఖ‌కు ఉక్కు ఉద్య‌మానికి చాలా తేడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 28, 2021 3:55 pm

Share

Recent Posts

లెనిన్ జేబులో వంద కోట్లు పడతాయా

అక్కినేని అఖిల్ కు బలమైన కంబ్యాక్ గా నిలిచిన లెనిన్ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతోంది. అయితే చెన్నై లవ్…

19 minutes ago

ఆదర్శంలో ఏదో మిస్సవుతోంది అధ్యక్ష్యా

వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయిక మీద ప్రేక్షకుల్లో ఓ రేంజులో హైప్ నెలకొంది. మాటల మాంత్రికుడు రచయితగా…

59 minutes ago

అంజి చేసిన తప్పు రిపీట్ కాకూడదు

విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడిన సినిమాలకు ఎక్కువ సమయం పడుతుంది. ఇది వాస్తవం. పైగా ఇప్పుడు ఏఐ వచ్చాక జనాలు…

1 hour ago

భాగ్యశ్రీ ని బ్లాక్ చేసిన తల్లి

సినిమాల పట్ల ముందుతరం తల్లిదండ్రుల్లో చాలా వరకు ప్రతికూల అభిప్రాయమే ఉంటుంది. తమ పిల్లల్లో ఎవరైనా సినిమాల్లోకి వెళ్తామంటే.. కంగారు…

2 hours ago

కొత్త దర్శకులు పాత సినిమాలు చూడాలి

అదేంటి ఎవరైనా కొత్తగా ఆలోచించాలి కానీ అదే పనిగా పాత సినిమాలు చూడటం ఏమిటనే సందేహం వస్తే మీరు పప్పులో…

3 hours ago

పావలా శ్యామల ఇక లేరు

క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందిన పావలా శ్యామల కన్ను మూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న శ్యామల గారికి…

5 hours ago