Political News

ఆ నలుగురూ బ్లాక్ మెయిలర్లట – ఆర్కే సంచలనం

నలుగు బీజేపీ నేతలపై ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ డైరెక్టుగానే సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వాన్ని చూపించి రాష్ట్రంలో నలుగురు నేతలు అందరినీ బెదిరిస్తు బతకటానికి అలవాటు పడిపోయారట. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధనరెడ్డి, జీవిఎల్ నరసింహారావు అందరినీ బెదిరిస్తు బతికేస్తున్నారట. వీళ్ళకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ అండగా నిలబడ్డారట.

మొత్తానికి నలుగురు నేతలపై రాధాకృష్ణ బ్లాక్ మెయిలర్లనే ముద్ర వేసేశారు. పార్టీ ప్రయోజనాలను గాలికొదిలేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే పై నలుగురు నేతలు పనిచేస్తున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. ఈ నలుగురి వల్ల పార్టీ పరిస్దితి రాష్ట్రంలో మరింతగా దిగజారిపోతోందని చాలామంది నేతలు తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు ఎండి చెప్పుకొచ్చారు.

ఇలాంటి నేపధ్యంలోనే జనసేన అదును కోసం ఎదురు చూస్తోందట. ఎందుకయ్యా అంటే బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకునేందుకట. వాళ్ళపై ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు చేస్తునే మరోవైపు తమ స్టూడియోలో ఐదు రోజుల క్రితం విష్ణుపై జరిగిన దాడిని కూడా ప్రస్తావించారు. స్టూడియోలో అమరావతి ఉద్యమంపై చర్చ జరుగుతున్న సమయంలోనే అమరావతి పరిరక్షణ సమితి నేత కొలకపూడి శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణును చెప్పుతో కొట్టారు. దానిపై అప్పట్లో కలకలం రేగింది.

దానికి కొనసాగింపుగా ఏబిఎన్ స్టూడియోలో జరిగే చర్చల్లో బీజేపీ నేతలు ఎవరు పాల్గొనకూదని వీర్రాజు ప్రకటించారు. దీంతో రాదాకృష్ణకు బాగా మండినట్లుంది. ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని కూడా వివరించారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయంతో ఏబిఎన్ యాజమాన్యానికి బాగా కోపం వచ్చినట్లుంది. అందకనే డైరెక్టుగానే వీర్రాజు అండ్ కో ను రాధాకృష్ణ బ్లాక్ మెయిలర్లంటూ అభివర్ణిస్తు తీవ్రమైన ఆరోపణలే చేశారు. మరి దీని రియాక్షన్ ఎలాగుంటుందో.

This post was last modified on February 28, 2021 1:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…

22 minutes ago

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…

57 minutes ago

దురంధర్ 2 డౌన్ అవ్వడానికి కారణాలేంటి

హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…

2 hours ago

టొవినో డ్రాపయ్యాడు… డ్రాగన్ నో అన్నాడు

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…

3 hours ago

అనుష్కని కాసేపే చూపిస్తే ఎలా

https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…

4 hours ago

త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…

4 hours ago