Political News

ఆ నలుగురూ బ్లాక్ మెయిలర్లట – ఆర్కే సంచలనం

నలుగు బీజేపీ నేతలపై ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ డైరెక్టుగానే సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వాన్ని చూపించి రాష్ట్రంలో నలుగురు నేతలు అందరినీ బెదిరిస్తు బతకటానికి అలవాటు పడిపోయారట. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధనరెడ్డి, జీవిఎల్ నరసింహారావు అందరినీ బెదిరిస్తు బతికేస్తున్నారట. వీళ్ళకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ అండగా నిలబడ్డారట.

మొత్తానికి నలుగురు నేతలపై రాధాకృష్ణ బ్లాక్ మెయిలర్లనే ముద్ర వేసేశారు. పార్టీ ప్రయోజనాలను గాలికొదిలేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే పై నలుగురు నేతలు పనిచేస్తున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. ఈ నలుగురి వల్ల పార్టీ పరిస్దితి రాష్ట్రంలో మరింతగా దిగజారిపోతోందని చాలామంది నేతలు తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు ఎండి చెప్పుకొచ్చారు.

ఇలాంటి నేపధ్యంలోనే జనసేన అదును కోసం ఎదురు చూస్తోందట. ఎందుకయ్యా అంటే బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకునేందుకట. వాళ్ళపై ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు చేస్తునే మరోవైపు తమ స్టూడియోలో ఐదు రోజుల క్రితం విష్ణుపై జరిగిన దాడిని కూడా ప్రస్తావించారు. స్టూడియోలో అమరావతి ఉద్యమంపై చర్చ జరుగుతున్న సమయంలోనే అమరావతి పరిరక్షణ సమితి నేత కొలకపూడి శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణును చెప్పుతో కొట్టారు. దానిపై అప్పట్లో కలకలం రేగింది.

దానికి కొనసాగింపుగా ఏబిఎన్ స్టూడియోలో జరిగే చర్చల్లో బీజేపీ నేతలు ఎవరు పాల్గొనకూదని వీర్రాజు ప్రకటించారు. దీంతో రాదాకృష్ణకు బాగా మండినట్లుంది. ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని కూడా వివరించారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయంతో ఏబిఎన్ యాజమాన్యానికి బాగా కోపం వచ్చినట్లుంది. అందకనే డైరెక్టుగానే వీర్రాజు అండ్ కో ను రాధాకృష్ణ బ్లాక్ మెయిలర్లంటూ అభివర్ణిస్తు తీవ్రమైన ఆరోపణలే చేశారు. మరి దీని రియాక్షన్ ఎలాగుంటుందో.

This post was last modified on February 28, 2021 1:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago