Political News

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ ఫోన్.. ఏం జరిగింది?

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. సొంత పార్టీ అధినేతతో సున్నం పెట్టుకున్న ఆయన తరచూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయటం.. పార్టీని ఇరుకున పెట్టటం మామూలే. గడిచిన కొద్దికాలంగా నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన.. తాజాగా తన నియోజకవర్గ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తన పర్యటన సందర్భంలో ఏదోలా అరెస్టు చేయాలన్న ఆలోచనలో సొంతపార్టీ నేతలు ఆలోచిస్తున్నారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాను వస్తున్నట్లు తెలిస్తే.. తన నియోజకవర్గం నుంచి 500 కార్లు విమానాశ్రయానికి వస్తాయన్న సమాచారం నిఘా వర్గాల రిపోర్టును ఒక డీఎస్పీ స్థాయి అధికారి సీఎంకి చేరవేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏ రీతిలో అయితే అనని మాటలు అన్నారని చెప్పి జైల్లో పెట్టారో.. అక్కడే కరోనా తగిలించారో చూశామని.. తన విషయంలోనూ అలానే చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపించారు.

ముఖ్యమంత్రి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయనకు తమ జిల్లాకు చెందిన మంత్రి తోడ్పాటు ఉందన్నారు. సొంత పార్టీకి చెందిన ఎంపీని నియోజకవర్గానికి వెళ్లకుండా చూస్తుంటే ముఖ్యమంత్రి ప్రశ్నించకపోవటం ఏమిటని ప్రశ్నించారు. తాను సీఎం జగన్ తో మాట్లాడేందుకు శుక్రవారం నుంచి ప్రయత్నిస్తుంటే ఫోన్ లైన్ లోకి రాకపోవటం దారుణమన్న ఎంపీ రఘురామ.. సీఎం దగ్గర ఎంత మొత్తుకున్నా అరణ్యరోదనలా ఉందన్నారు.

మంత్రి రంగనాథ రాజులుపై చర్యలు తీసుకొని తాను నియోజకవర్గానికి వెళ్లేలా చూడాలన్నారు. ఒకవేళ.. అలాంటి పరిస్థితి లేకపోతే.. తానీ విషయంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే లోపు తనకు సరైన సమాధానం రాకపోతే.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని.. ఇది రాష్ట్రానికి.. ముఖ్యమంత్రికి మంచిది కాదన్న హెచ్చరిక చేవారు. మరి.. దీనికి ఏపీ అధికారపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on February 27, 2021 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

43 minutes ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

2 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

2 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

2 hours ago

రోహిత్ ర‌చ్చ‌: బీఆర్ఎస్‌ దిద్దుబాటు చ‌ర్య‌లు!

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన వేళ తెలంగాణ ప్ర‌ధాన ప్రతిప‌క్షం బీఆరఎస్‌ పార్టీ ఇరుకున ప‌డిన విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్…

3 hours ago

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

5 hours ago