ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా పేరు వింటేనే… అందరూ ఒకింత భయాందోళనలకు గురవుతున్నమాట చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆ వైరస్ తమకు సోకుతుందోనన్న భయం మనల్నీ ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడిపై తనదైన శైలి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వైరస్ పేరు వింటే హడలిపోతున్నారని చెప్పక దప్పదు. కరోనాను చాలా లైటర్ వేలో తీసుకుంటున్నట్లుగా ఫోజు కొడుతున్న ట్రంప్… తన దైనందిన జీవితంలో ఆ వైరస్ ఎక్కడ తనను అంటుకుంటుందేమోనని ఓ రేంజిలో భయపడిపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా ప్రతి రోజూ తాను కరోనా పరీక్షలు చేయించుకుంటానని, ఇప్పటికే రోజువారీ కరోనా టెస్టులు మొదలెట్టినట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.
ఆ వివరాల్లోకి వెళితే… ట్రంప్కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో పనిచేస్తోన్న అమెరికా మిలిటరీ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటికే ట్రంప్తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్కు కరోనా పరీక్షలు చేయగా వారిద్దరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… కరోనా సోకిన తన వ్యక్తిగత భద్రతా అధికారిని శ్వేతసౌధంలో తాను, మైక్ పెన్స్ అరుదుగా కలిసేవారమని చెప్పారు. ఆ అధికారి చాలా మంచివాడని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే తాను, మైక్ కరోనా పరీక్షలు చేయించుకున్నామని ట్రంప్ చెప్పారు. తాను, మైక్తో పాటు శ్వేతసౌధంలోని సిబ్బంది అందరం ఇకపై ప్రతి రోజు కరోనా వైరస్ పరీక్ష చేయించుకుంటామని తెలిపారు. తాను గురువారం, శుక్రవారం పరీక్షలు చేయించుకున్నానని, రెండుసార్లూ నెగిటివ్ అని నిర్ధారణ అయిందని ట్రంప్ ప్రకటించారు. మైక్కి కూడా నెగిటివ్ అని తేలిందని చెప్పారు. ఇంతకు ముందు తాము వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకునేవారమని, ఇకపై ప్రతిరోజు చేయించుకుంటామని తెలిపారు. ఈ ప్రకటన చూస్తుంటే… కరోనా అంటే ట్రంప్ ఏ మేర భయపడిపోతున్నారో ఇట్టే తెలిసిపోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…