అన్ని సందర్భాల్లో కాకున్నా కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలు చాలానే కనిపిస్తాయి. తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారారు రాజన్న కుమార్తె షర్మిల. కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్న ఆమె.. ఇప్పటివరకు ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇంత ఒద్దికగా ముందుకు వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. పార్టీ ఏర్పాటు నిర్ణయం మొదలు.. దాన్ని ఎలా అమలు చేయాలన్న అంశం వరకు అంతా ఎవరో ముందస్తుగా స్క్రిప్టు రాసినట్లుగా ఒకటి తర్వాత ఒకటి జరిగటం ఆసక్తికరంగా మారింది.
తనకు పదవి ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని తన అన్న జగన్ ను అడగాలంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమెకు ఎంతో చెప్పామంటూ జగన్ రాజకీయ సలహాదారుల్లో ఒకరు ఆ మధ్య చేసిన వ్యాఖ్యలకు షర్మిల తాజా సమాధానం చూసినప్పుడు.. పదవుల లొల్లి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టటానికి కారణమైందన్న విషయంపై క్లారిటీ రాక మానదు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రావటానికి కారణమైన టీఆర్ఎస్ ఏర్పాటు కూడా ‘పదవి’ చుట్టూనే తిరగటాన్ని మర్చిపోకూడదు. తనకు మంత్రి పదవి ఇస్తారని కేసీఆర్ భావించటం.. అందుకు భిన్నంగా చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేయటం తెలిసిందే. మంత్రి పదవి ఇవ్వని బాబు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీని పెట్టటం.. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాను తీసుకున్న కేసీఆర్.. కాల క్రమంలో కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చటం తెలిసిందే.
ఈ రోజు సరిగ్గా.. ఆ విషయాలన్ని గుర్తుకు తెచ్చేలా షర్మిల నోటి నుంచి వచ్చిన మాట ఉండటం ఆసక్తికరం. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యను విశ్లేషిస్తే.. జగన్ వదిలిని బాణంలా దూసుకెళ్లిన ఆమె.. ఏపీలో తన అన్న చేతికి అధికారం వచ్చేలా చేయటంతో కష్టపడ్డారన్నది నిజం. అయితే.. అధికారంలో అంతో ఇంతో వాటా ఇవ్వకుండా.. తనను ఇంటికే పరిమితం చేయటంపై గుర్రుగా ఉన్న షర్మిల.. ఈ రోజున తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ పెట్టినట్లుగా స్పష్టమవుతోంది. అప్పట్లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టటానికి కారణమైన పదవి.. ఈ రోజున షర్మిల పార్టీ పెట్టటానికి అదే కారణం కావటం కాకతాళీయమని చెప్పక తప్పదు. అప్పట్లో కేసీఆర్.. ఇప్పుడు షర్మిల అన్న భావన కలుగక మానదు.
This post was last modified on February 25, 2021 10:44 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…