అన్ని సందర్భాల్లో కాకున్నా కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలు చాలానే కనిపిస్తాయి. తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారారు రాజన్న కుమార్తె షర్మిల. కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్న ఆమె.. ఇప్పటివరకు ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇంత ఒద్దికగా ముందుకు వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. పార్టీ ఏర్పాటు నిర్ణయం మొదలు.. దాన్ని ఎలా అమలు చేయాలన్న అంశం వరకు అంతా ఎవరో ముందస్తుగా స్క్రిప్టు రాసినట్లుగా ఒకటి తర్వాత ఒకటి జరిగటం ఆసక్తికరంగా మారింది.
తనకు పదవి ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని తన అన్న జగన్ ను అడగాలంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమెకు ఎంతో చెప్పామంటూ జగన్ రాజకీయ సలహాదారుల్లో ఒకరు ఆ మధ్య చేసిన వ్యాఖ్యలకు షర్మిల తాజా సమాధానం చూసినప్పుడు.. పదవుల లొల్లి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టటానికి కారణమైందన్న విషయంపై క్లారిటీ రాక మానదు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రావటానికి కారణమైన టీఆర్ఎస్ ఏర్పాటు కూడా ‘పదవి’ చుట్టూనే తిరగటాన్ని మర్చిపోకూడదు. తనకు మంత్రి పదవి ఇస్తారని కేసీఆర్ భావించటం.. అందుకు భిన్నంగా చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేయటం తెలిసిందే. మంత్రి పదవి ఇవ్వని బాబు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీని పెట్టటం.. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాను తీసుకున్న కేసీఆర్.. కాల క్రమంలో కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చటం తెలిసిందే.
ఈ రోజు సరిగ్గా.. ఆ విషయాలన్ని గుర్తుకు తెచ్చేలా షర్మిల నోటి నుంచి వచ్చిన మాట ఉండటం ఆసక్తికరం. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యను విశ్లేషిస్తే.. జగన్ వదిలిని బాణంలా దూసుకెళ్లిన ఆమె.. ఏపీలో తన అన్న చేతికి అధికారం వచ్చేలా చేయటంతో కష్టపడ్డారన్నది నిజం. అయితే.. అధికారంలో అంతో ఇంతో వాటా ఇవ్వకుండా.. తనను ఇంటికే పరిమితం చేయటంపై గుర్రుగా ఉన్న షర్మిల.. ఈ రోజున తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ పెట్టినట్లుగా స్పష్టమవుతోంది. అప్పట్లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టటానికి కారణమైన పదవి.. ఈ రోజున షర్మిల పార్టీ పెట్టటానికి అదే కారణం కావటం కాకతాళీయమని చెప్పక తప్పదు. అప్పట్లో కేసీఆర్.. ఇప్పుడు షర్మిల అన్న భావన కలుగక మానదు.
This post was last modified on February 25, 2021 10:44 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…