Political News

కేంద్రాన్ని వణికిస్తున్న తికాయత్ పిలుపు

భారతీయ కిసాన్ యూనియర్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ తాజాగా ఇచ్చిన పిలుపు కేంద్రప్రభుత్వాన్ని వణికించేస్తోంది. కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే పార్లమెంటును ముట్టడించాలంటు పిలుపిచ్చారు. ఏకంగా 40 లక్షల ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేవించాల, పార్లమెంటును ముట్టడించాలని ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. ఢిల్లీ కవాతుకు ఏ క్షణంలో అయినా పిలుపు రావచ్చని కాబట్టి రైతులంగా అందుకు సిద్ధంగా ఉండాలని తికాయత్ చెప్పారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన తికాయత్ పిలుపును యూపీతో పాటు హర్యానా, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాల్లో రైతులు తూచా తప్పకుండా పాటిస్తారు. జాట్ వర్గానికి చెందిన తికాయత్ పై రైతుల్లో అపారమైన నమ్మకముంది. అందుకనే తికాయత్ ఏదైనా పిలుపిచ్చారంటే కేంద్రం వణికిపోతోంది. జనవరి 26వ తేదీన ఢిల్లీ వీధుల్లో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి పిలుపే ఇవ్వటంతో ఏ క్షణంలో ఏమవుతుందో అర్ధంకాక కేంద్రప్రభుత్వం వణికి పోతోంది.

పైగా ఆందోళనలో పాల్గొనే రైతులు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న పార్కులను దున్ని పంటలను సాగు చేయాలని చ తికాయత్ చెప్పటం కలకలం సృష్టిస్తోంది. నిజంగానే తికాయత్ పిలుపును రైతులు ఆచరణలో పెడితే ఇంకేమన్నా ఉందా ? 40 లక్షల ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించటమంటేనే పెద్ద సంచలనంగా చెప్పాలి. అలాంటిది ప్రతి ట్రాక్టర్లోను పదిమంది ప్రయాణించినా 4 కోట్లమంది ఆందోళనకారులు తయారవుతారు. వీరంతా ట్రాక్టర్లేసుకుని ఢిల్లీలోకి ప్రవేశించటం కనబడిన పార్కులన్నింటినీ దున్నటం మొదలుపెడితే ఇంకేమన్నా ఉందా ?

ఇదే సమయంలో కనీస మద్దతుధరలకు కేంద్రం చట్టం చేయకపోతే పంటలను తగలపెట్టేస్తామన్నారు. హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో మూడు రోజులుగా రైతులు తమ గోధుమ పంటలను తగలబెట్టేసుకుంటున్నారు. పంటల నిల్వల కోసం పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించుకున్న గోదాములను కూల్చేస్తామని హెచ్చరించారు.

తికాయత్ తాజా హెచ్చరికలను చూస్తుంటే ముందు ముందు ఉద్యమం హింసాత్మకంగా మారే సంకేతాలు బాగా కనబడుతున్నాయి. అదే గనుక జరిగితే కేంద్రప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడటం ఖాయమే. మరి పరిస్దితులు అంతవరకు రాకుండా చూసుకోవటంలో కేంద్రం ఎంతవరకు చొరవ చూపిస్తుందో చూడాల్సిందే.

This post was last modified on February 24, 2021 3:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

11 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

12 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

13 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

14 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

15 hours ago