Political News

కేంద్రాన్ని వణికిస్తున్న తికాయత్ పిలుపు

భారతీయ కిసాన్ యూనియర్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ తాజాగా ఇచ్చిన పిలుపు కేంద్రప్రభుత్వాన్ని వణికించేస్తోంది. కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే పార్లమెంటును ముట్టడించాలంటు పిలుపిచ్చారు. ఏకంగా 40 లక్షల ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేవించాల, పార్లమెంటును ముట్టడించాలని ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. ఢిల్లీ కవాతుకు ఏ క్షణంలో అయినా పిలుపు రావచ్చని కాబట్టి రైతులంగా అందుకు సిద్ధంగా ఉండాలని తికాయత్ చెప్పారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన తికాయత్ పిలుపును యూపీతో పాటు హర్యానా, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాల్లో రైతులు తూచా తప్పకుండా పాటిస్తారు. జాట్ వర్గానికి చెందిన తికాయత్ పై రైతుల్లో అపారమైన నమ్మకముంది. అందుకనే తికాయత్ ఏదైనా పిలుపిచ్చారంటే కేంద్రం వణికిపోతోంది. జనవరి 26వ తేదీన ఢిల్లీ వీధుల్లో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి పిలుపే ఇవ్వటంతో ఏ క్షణంలో ఏమవుతుందో అర్ధంకాక కేంద్రప్రభుత్వం వణికి పోతోంది.

పైగా ఆందోళనలో పాల్గొనే రైతులు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న పార్కులను దున్ని పంటలను సాగు చేయాలని చ తికాయత్ చెప్పటం కలకలం సృష్టిస్తోంది. నిజంగానే తికాయత్ పిలుపును రైతులు ఆచరణలో పెడితే ఇంకేమన్నా ఉందా ? 40 లక్షల ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించటమంటేనే పెద్ద సంచలనంగా చెప్పాలి. అలాంటిది ప్రతి ట్రాక్టర్లోను పదిమంది ప్రయాణించినా 4 కోట్లమంది ఆందోళనకారులు తయారవుతారు. వీరంతా ట్రాక్టర్లేసుకుని ఢిల్లీలోకి ప్రవేశించటం కనబడిన పార్కులన్నింటినీ దున్నటం మొదలుపెడితే ఇంకేమన్నా ఉందా ?

ఇదే సమయంలో కనీస మద్దతుధరలకు కేంద్రం చట్టం చేయకపోతే పంటలను తగలపెట్టేస్తామన్నారు. హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో మూడు రోజులుగా రైతులు తమ గోధుమ పంటలను తగలబెట్టేసుకుంటున్నారు. పంటల నిల్వల కోసం పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించుకున్న గోదాములను కూల్చేస్తామని హెచ్చరించారు.

తికాయత్ తాజా హెచ్చరికలను చూస్తుంటే ముందు ముందు ఉద్యమం హింసాత్మకంగా మారే సంకేతాలు బాగా కనబడుతున్నాయి. అదే గనుక జరిగితే కేంద్రప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడటం ఖాయమే. మరి పరిస్దితులు అంతవరకు రాకుండా చూసుకోవటంలో కేంద్రం ఎంతవరకు చొరవ చూపిస్తుందో చూడాల్సిందే.

This post was last modified on February 24, 2021 3:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘బ్యాడ్ ‌బాయ్’ శింబును మార్చేసిన మణిరత్నం

కోలీవుడ్లో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న హీరోల్లో శింబు ఒకడు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు,…

40 minutes ago

ఎస్‌.. వీరి బంధం ఫెవికాల్‌నే మించిందిగా.. !

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో శుక్ర‌వారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌.. వేదిక‌పై జ‌రిగిన కొన్ని కీల‌క ప‌రిణా మాలు చూస్తే.. జ‌న‌సేన…

3 hours ago

జాతీయ మీడియాకెక్కిన అమ‌రావ‌తి.. బాబు స‌క్సెస్‌.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు కృషి ఫ‌లించింది. ఆయ‌న క‌ల‌లు కంటున్న రాజ‌ధాని అమ‌రావ‌తి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.…

3 hours ago

వైసీపీ టాక్‌: ఆ ఒక్క‌డే అన్నీ తానై.. !

వైసీపీలో నాయ‌కులు చాలా మంది డి-యాక్టివేష‌న్‌లో ఉన్నారు. కాక‌లు తీరిన క‌బుర్లు చెప్పిన నాయ‌కులు కూడా మౌనంగా ఉంటూ.. ర‌మ‌ణ…

3 hours ago

అంబ‌టి గారూ.. మూడు ముక్క‌లాట మ‌రిచారా?!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు .. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌రోసారి అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని…

3 hours ago

సన్‌రైజర్స్ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ?

ఈసారి ఐపీఎల్ మొదలవుతుండగా.. అందరి కళ్లూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. ఆ జట్టును టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా పేర్కొన్నారు…

4 hours ago