Political News

వైజాగ్‌పై జగన్‌కు ఎంత ప్రేమో..

విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చురుగ్గా స్పందించారో తెలిసిందే. వెంటనే అమరావతి నుంచి విశాఖకు బయల్దేరారు. బాధితుల్ని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. తక్షణం భారీగా నష్టపరిహారం ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. విశాఖ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయింది 11 మంది.

ఐతే గత ఏడాది జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీలో ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరిలో విహారం కోసం వెళ్లిన 80 మంది దాకా బోటుతో సహా మునిగిపోయారు. అందులో అటు ఇటుగా ఓ 30 మంది దాకా బయటపడ్డారు. దాదాపు 50 మంది నీటిలో సజీవ సమాధి అయ్యారు. ఐతే అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ స్పందించిన తీరు విమర్శలకు దారి తీసింది.

ఇప్పుడు వైజాగ్ ఘటనలో మాదిరి జగన్ నుంచి సత్వర స్పందన లేకపోయింది. అందుకు తగ్గట్లే గోదావరిలో సహాయ చర్యలు చేపట్టడంలోనూ అధికార యంత్రాంగం అంత చురుగ్గా స్పందించలేదు. మృతదేహాల్ని కూడా చాలా ఆలస్యంగా బయటికి తీశారు. కానీ విశాఖపట్నం ఉదంతంలో మాత్రం అన్నీ యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జగన్ కూడా తక్షణం స్పందించారు.

మరి గోదావరికి, విశాఖకు తేడా ఏంటి అనే ప్రశ్న తలెత్తిందిపుడు. ఇందుక్కారణం విశాఖకు రాజధానిని మార్చాలన్న జగన్ పట్టుదలే అన్నది విశ్లేషకుల మాట. కరోనా వైరస్ విషయంలోనూ వైజాగ్‌ను రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ కనిపించింది. ఇక్కడ కరోనా కేసుల్ని తగ్గించి చూపే ప్రయత్నమూ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు గ్యాస్ లీక్ ఉదంతం విషయంలోనూ జగన్ చొరవ చూసి ఇక్కడికి రాజధాని మార్చే విషయంలో పట్టుదలతో ఉన్న జగన్.. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on May 8, 2020 6:38 pm

Share
Show comments
Published by
Satya
Tags: JaganVizag

Recent Posts

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

2 minutes ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

1 hour ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 hour ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

1 hour ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago