కలలో కూడా ఊహించని రీతిలో భారతీయ అమెరికన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. భారత మూలాలు ఉన్న మహిళ అగ్రరాజ్యమైన అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత మూలాలు ఉన్న పలువురికి బైడెన్ సర్కారులో పదవులు దక్కుతున్నాయి.
తాజాగా ఆ కోవలోకే మరో మహిళ చేశారు. భారత అమెరికన్ అయిన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో నియమిస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది.
గతంలో ఆమె సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ లో వాతావరణ.. విద్యుత్ పాలసీ డైరెక్టర్ గా పని చేశారు. అంతకు ముందు విలేజ్ క్యాపిటల్ అనే సంస్థలోనూ ఆమె పని చేశారు. వాతావరణ.. విద్యుత్ శాఖల్లో నిపుణురాలైన ఆమె.. భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన సింపా నెట్ వర్క్స్ అనే స్టార్ట్ కంపెనీతో మూడేళ్ల పాటు పని చేశారు.
హార్వర్డ్ వర్సిలీలో పబ్లిక్పాలసీపై మాస్టర్స్.. సెయింట్ ఆలఫ్ కాలేజీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఇప్పటికే పలువురు భారత అమెరికన్లు బైడెన్ సర్కారులో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. తాజా ఎంపికతో ఆ టీంలో బిడీషా చేరినట్లైంది.
This post was last modified on February 23, 2021 1:53 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…