కలలో కూడా ఊహించని రీతిలో భారతీయ అమెరికన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. భారత మూలాలు ఉన్న మహిళ అగ్రరాజ్యమైన అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత మూలాలు ఉన్న పలువురికి బైడెన్ సర్కారులో పదవులు దక్కుతున్నాయి.
తాజాగా ఆ కోవలోకే మరో మహిళ చేశారు. భారత అమెరికన్ అయిన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో నియమిస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది.
గతంలో ఆమె సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ లో వాతావరణ.. విద్యుత్ పాలసీ డైరెక్టర్ గా పని చేశారు. అంతకు ముందు విలేజ్ క్యాపిటల్ అనే సంస్థలోనూ ఆమె పని చేశారు. వాతావరణ.. విద్యుత్ శాఖల్లో నిపుణురాలైన ఆమె.. భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన సింపా నెట్ వర్క్స్ అనే స్టార్ట్ కంపెనీతో మూడేళ్ల పాటు పని చేశారు.
హార్వర్డ్ వర్సిలీలో పబ్లిక్పాలసీపై మాస్టర్స్.. సెయింట్ ఆలఫ్ కాలేజీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఇప్పటికే పలువురు భారత అమెరికన్లు బైడెన్ సర్కారులో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. తాజా ఎంపికతో ఆ టీంలో బిడీషా చేరినట్లైంది.
This post was last modified on February 23, 2021 1:53 pm
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…