కలలో కూడా ఊహించని రీతిలో భారతీయ అమెరికన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. భారత మూలాలు ఉన్న మహిళ అగ్రరాజ్యమైన అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారత మూలాలు ఉన్న పలువురికి బైడెన్ సర్కారులో పదవులు దక్కుతున్నాయి.
తాజాగా ఆ కోవలోకే మరో మహిళ చేశారు. భారత అమెరికన్ అయిన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో నియమిస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది.
గతంలో ఆమె సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ లో వాతావరణ.. విద్యుత్ పాలసీ డైరెక్టర్ గా పని చేశారు. అంతకు ముందు విలేజ్ క్యాపిటల్ అనే సంస్థలోనూ ఆమె పని చేశారు. వాతావరణ.. విద్యుత్ శాఖల్లో నిపుణురాలైన ఆమె.. భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన సింపా నెట్ వర్క్స్ అనే స్టార్ట్ కంపెనీతో మూడేళ్ల పాటు పని చేశారు.
హార్వర్డ్ వర్సిలీలో పబ్లిక్పాలసీపై మాస్టర్స్.. సెయింట్ ఆలఫ్ కాలేజీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఇప్పటికే పలువురు భారత అమెరికన్లు బైడెన్ సర్కారులో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. తాజా ఎంపికతో ఆ టీంలో బిడీషా చేరినట్లైంది.
This post was last modified on February 23, 2021 1:53 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…