Political News

ఆ రాష్ట్ర బీజేపీ అగ్రనేత ఫ్యామిలీలో నలుగురు సూసైడ్

రాజస్థాన్ బీజేపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. దీంతో.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోఈ అంశంపై సంచలనంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటంపై పెద్ద ఎత్తున విషాదం వ్యక్తమవుతోంది.

ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు.. మదన్ లాల్ సైనీ కుటుంబానికి చెందిన ఒకరి మరణం.. వారి కుటుంబాన్ని తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యేలా చేసిందని.. ఈ కారణంతోనే వారు సూసైడ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో మదన్ లాల్ సైనీ సోదరుడు హనుమాన్ ప్రసాద్ కుమారుడు మరణించారు. దీంతో.. వారి కుటుంబం తీవ్రమైన మానసిక వ్యధకు లోనైనట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తామంతా ఊరి వేసుకొని మరణించినట్లుగా హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ లేఖలో ఉంది. ఇక.. తాజాగా ఆత్మహత్య చేసుకున్న వారిలో సోదరుడు హనుమాన్ ప్రసాద్ సైనీ.. మదన్ లాల్ భార్య తారా.. వారి ఇద్దరు కుమార్తెలు అంజు.. పూజాలు ఉన్నారు. తన పెద్ద కుమారుడు మరణించిన తర్వాత తనకు బతకాలన్న ఆశ లేదంటూ హనుమాన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు రాజస్థాన్ లో సంచలనంగా మారింది.

This post was last modified on February 22, 2021 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

42 minutes ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

2 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

5 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

6 hours ago