Political News

నరేంద్రమోడికి లీగల్ నోటీసులు ?

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవటంపై ప్రదానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ కో కు లీగల్ నోటీసులు ఇవ్వాలని ఏపీసీసీ లీగల్ సెల్ తీర్మానించింది. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఏపి డెవలప్మెంటుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. అందులో ప్రత్యేకహోదా అనేది చాలా కీలకం. ఏపి అభివృద్ధికి ప్రత్యేకహోదాను ఐదేళ్ళ పాటు అమలు చేయనున్నట్లు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు.

అయితే రాజ్యసభలో అప్పటి బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతు ప్రత్యేకహోదా ఐదేళ్ళు చాలదు పదేళ్ళు కావాలని డిమాండ్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్నికలసమయంలో నరేంద్రమోడి, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగసభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు ప్రత్యేకహోదా పదేళ్ళు చాలదని 15 ఏళ్ళు కావాలని మోడికి సూచించారు.

సీన్ కట్ చేస్తే నరేంద్రమోడి ప్రధానమంత్రయ్యారు. వెంకయ్య కేంద్ర మంత్రయ్యారు. చంద్రబాబు సీఎం అయ్యారు. ఏపికి ప్రత్యేకహోదా వెసులుబాటును మోడి తుంగలో తొక్కారు. హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ద్వారా ప్రతిపాదించారు. దానికి చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇక ఈ విషయంలో చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు అందరికీ తెలిసిందే. చివరకు తేలినదేమిటయ్యా అంటే అటు హోదా లేదు ఇటు ప్యాకేజీ లేదు.

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సందర్భం వచ్చినపుడల్లా ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతున్నారే కానీ మోడిపై ఒత్తిడి తేలేకపోతున్నారు. రాజకీయంగా ఏపిపై బీజేపీ ఆధారపడే పరిస్ధితి వస్తే మాత్రమే ప్రత్యేకహోదా వస్తుందేమో చూడాలి. ఇలాంటి పరిస్దితుల్లో ఏపీసీసీ లీగల్ సెల్ సమావేశంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, హోం శాఖ కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లీగల్ నోటీసులు పంపాలని డిసైడ్ చేసింది.

ఇదే విషయమై సుప్రింకోర్టులో కేసులు వేయాలని కూడా నిర్ణయమైంది. అసలు రాష్ట్ర విభజనే చెల్లదని ఇప్పటికే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రింకోర్టులో కేసు వేస్తున్నారు. అదేమైందో ఎవరికీ తెలీదు. విభజన జరిగిన ఇంత కాలానికి ప్రత్యేకహోదా విషయంలో న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మరి కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా ?

This post was last modified on February 21, 2021 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

54 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago