పార్టీ పెట్టాలన్న ఆలోచన కష్టం కాదు కానీ.. పార్టీని పక్కా ప్లాన్ తో పెట్టటం అంత తేలికైన విషయం కాదు. ఈ కారణంతోనే చాలామంది పార్టీలు పెడతారు కానీ.. దాని ప్రభావం ప్రజల్లో పెద్దగా కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత చాలామంది చాలా పార్టీలే పెట్టారు. కానీ.. ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినవి రెండు పార్టీలే. అందులో ఒకటి టీఆర్ఎస్.. రెండోది వైఎస్సార్ కాంగ్రెస్. మిగిలిన పార్టీల్లో కొన్నింటికి ప్రజాదరణ ఉన్నప్పటికీ.. చేతికి పవర్ మాత్రం రాని దుస్థితి. ఎందుకిలా అంటే.. పార్టీ పెట్టటం ఈజీనే. కానీ.. ప్రజల నమ్మకాన్ని దోచుకోవటం.. వారి మనసుల్లో అధికారం తమకు ఇవ్వాలన్న భావనను బలంగా కలిగించేలా చేయటం మామూలు విషయం కాదు.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో రాజన్న కుమార్తె షర్మిల కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ కావటం.. అందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లటం తెలిసిందే. శనివారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో హైదరాబాద్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చింది షర్మిల టీం.
తనతో భేటీకి వచ్చిన వారందరికి.. 11 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ చేతిలో పెట్టారు. అందులో వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రశ్నావళిని పూర్తి చేసే ప్రతి ఒక్కరు ఫోన్ నెంబరుతో పాటు.. వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలతో పాటు వాట్సాప్ ఫోన్ నెంబరును నమోదు చేయలని కోరటం గమానార్హం.
ఇంతకూ షర్మిల టీం ఇస్తున్న ప్రశ్నావళిలో ఏముంది? అన్న విషయంలోకి వెళితే..
1 తెలంగాణలో వైఎ్సఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలేమిటి? వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి?
This post was last modified on February 21, 2021 11:07 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…