Political News

విశాఖ ఉక్కుపై కేంద్రం వెనక్కు తగ్గిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు అండ్ కో పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరుతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ఆందోళనలను గమనించిన కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకున్నదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

విశాఖ ఉక్కుకు ధక్షిణకొరియాలోని పోస్కో సంస్ధకు మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయు) జరిగినట్లు స్వయంగా ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధానే స్పష్టంగా ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత విశాఖపట్నంలో ఆందోళనలు పెరిగిపోయాయి. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఏపి సీఎం లేఖ కూడా రాసిన విషయం అందరికీ తెలిసిందే. 2018 అక్టోబర్లోనే విశాఖ ఉక్కును పోస్కో కంపెనీకి అప్పగించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారమే 2019 అక్టోబర్లో ఎంవోయు జరిగిందని కూడా ధర్మేంద్ర చెప్పారు.

వాస్తవం ఇలాగుంటే బీజేపీ నేతలు మాత్రం కొత్త డ్రామాలకు తెరలేపారు. ఉక్కు పరిశ్రమ ప్రయోజనాల రక్షణ కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు అండ్ కో పదే పదే చెబుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యమే కేంద్రానికి లేదని చెప్పటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా అధికార, ప్రతిపక్షాలు ఆందోళనల పేరుతో రాజకీయాలు చేస్తున్నట్లు వీర్రాజు ఎదురుదాడి మొదలుపెట్టడమే ఆశ్చర్యంగా ఉంది.

పైగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల నుండి జనాల దృష్టి మళ్ళించేందుకే అధికారపార్టీ ఉక్కు ఆందోళనలు మొదలుపెట్టించినట్లు విరుచుకుపడుతున్నారు. జరుగుతున్నది చూస్తుంటే ఆందోళనల కారణంగా కేంద్రం ఏమైనా తన నిర్ణయంలో వెనక్కు తగ్గుతోందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. ఏ యాజమాన్యమైనా ఓ ఫ్యాక్టరీని కానీ లేదా కంపెనీని టేకెనోవర్ చేసేటపుడు ఎటువంటి ఆందోళనలు జరగకూడదనే అనుకుంటుంది.

అయితే ఇక్కడ జరుగుతున్న ఆందోళనల కారణంగా పోస్కో యాజమాన్యంలో టెన్షన్ మొదలైనట్లు అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం తన నిర్ణయం విషయంలో వెనక్కు పోయిందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఆ విషయం చెప్పకుండా వీర్రాజు అండ్ కో మాత్రం ప్రైవేటీకరణ నిర్ణయమే ప్రకటించలేదని చెప్పటమే విడ్డూరంగా ఉంది. మొత్తానికి ప్రజాందోళనలకు కేంద్రం తలొంచిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు వీర్రాజు మాటలను కేంద్రం పట్టించుకుంటుందా ?

This post was last modified on February 20, 2021 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

42 minutes ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

2 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

2 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

2 hours ago

రోహిత్ ర‌చ్చ‌: బీఆర్ఎస్‌ దిద్దుబాటు చ‌ర్య‌లు!

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన వేళ తెలంగాణ ప్ర‌ధాన ప్రతిప‌క్షం బీఆరఎస్‌ పార్టీ ఇరుకున ప‌డిన విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్…

3 hours ago

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

5 hours ago