Political News

5 వేల మందికి ష‌ర్మిల‌ ఆహ్వానాలు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు ష‌ర్మిల తెలంగాణాలో జోరు పెంచారు. తొంద‌ర‌లోనే పార్టీ పెట్టి రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల అందుకు త‌గ్గ‌ట్లే స‌మావేశాల జోరు పెంచారు. మొద‌టి స‌మావేశం న‌ల్గొండ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో జ‌రిపిన ఈమె తాజాగా అంటే ఖ‌మ్మం జిల్లాలోని మ‌ద్ద‌తుదారులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈనెల 20వ తేదీన అంటే ఈరోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోనే హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల వారితో స‌మావేశం అవనున్నారు.

హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అభిమానులు, మ‌ద్ద‌తుదారులు సుమారు 5 వేల‌మందికి ఆహ్వానాలు పంపారు. అలాగే ఇత‌ర పార్టీల్లో నుండి ష‌ర్మిల పెట్ట‌బోయే కొత్త‌పార్టీలోకి వ‌చ్చే వారెవ‌ర‌నే విష‌యంలో ఇప్ప‌టికే అంచ‌నాకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర పార్టీల్లో ఉన్న వైఎస్సార్ మ‌ద్ద‌తుదారులు, అభిమానుల పై ప్ర‌ధానంగా టార్గెట్ పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ష‌ర్మిల పార్టీ పెట్టి యాక్టివిటి పెంచితే ముందుగా న‌ష్ట‌పోయేది కాంగ్రెస్ పార్టీయే అనే ప్ర‌చారం ఊపందుకుంటోంది.

టీఆర్ఎస్ లో చేర‌టం ఇష్టంలేక, కాంగ్రెస్ లో ఉండ‌లేక‌, బీజేపీలో చేర‌లేక ఇప్ప‌టికి నానా అవ‌స్త‌లు ప‌డుతున్న నేత‌లు ప్ర‌ధానంగా రెడ్డి స‌మాజిక‌వ‌ర్గం నేత‌లున్నారు. వీళ్ళ‌లో స‌గం మంది ష‌ర్మిల‌తో చేయి క‌లిపినా పార్టీ లాంచింగే చాలా గ‌ట్టిగా ఉంటుంద‌ని ష‌ర్మిల రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చూస్తున్న కీల‌క నేత‌లు భావిస్తున్నారు. పార్టీ పెట్ట‌కుండా, జెండా ఏమిటో, అజెండా ఏమిటో బ‌య‌ట‌పెట్ట‌లేదు కాబ‌ట్టి అంద‌రికీ ఆస‌క్తిగా ఉంది. అదే ఒక‌సారి అజెండా ఏమిటో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే అపుడు మొద‌ల‌వుతుంది అస‌లు గేమ్. జెండా, అజెండా తయారుచేసే బాధ్యతను షర్మిల ఒక బృందంతో పాటు మరో ఏజెన్సీకి అప్పగించినట్లు చెబుతున్నారు.

అందుక‌నే ఇప్ప‌టినుండే ష‌ర్మిల పార్టీ జోరును పెంచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఒకేసారి లోట‌స్ పాండ్ లో 5 వేల‌మందితో స‌మావేశం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్ప‌టికే తెలంగాణా వ్యాప్తంగా చాలామందితో ష‌ర్మిల ట‌చ్ లోకి వెళ్ళిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఇపుడున్నంత జోరు పార్టీ పెట్టిన త‌ర్వాత కూడా ఉంటుందా అనేదే అనుమానం. పార్టీ పెట్టేనాటికి ష‌ర్మిల‌తో ఎంత‌మంది ప్ర‌ముఖ నేత‌లు చేతులు క‌లుపుతార‌నే దానిపై కొత్త పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డుంది. చూద్దాం ఏమి జ‌రుగుతుందో.

Satya

Recent Posts

పొరబడ్డారు… నేనలాంటి వాడిని కాదు: ఏబీవీ

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…

33 minutes ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

4 hours ago

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

10 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

10 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

12 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

12 hours ago