Political News

5 వేల మందికి ష‌ర్మిల‌ ఆహ్వానాలు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు ష‌ర్మిల తెలంగాణాలో జోరు పెంచారు. తొంద‌ర‌లోనే పార్టీ పెట్టి రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల అందుకు త‌గ్గ‌ట్లే స‌మావేశాల జోరు పెంచారు. మొద‌టి స‌మావేశం న‌ల్గొండ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో జ‌రిపిన ఈమె తాజాగా అంటే ఖ‌మ్మం జిల్లాలోని మ‌ద్ద‌తుదారులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈనెల 20వ తేదీన అంటే ఈరోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోనే హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల వారితో స‌మావేశం అవనున్నారు.

హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అభిమానులు, మ‌ద్ద‌తుదారులు సుమారు 5 వేల‌మందికి ఆహ్వానాలు పంపారు. అలాగే ఇత‌ర పార్టీల్లో నుండి ష‌ర్మిల పెట్ట‌బోయే కొత్త‌పార్టీలోకి వ‌చ్చే వారెవ‌ర‌నే విష‌యంలో ఇప్ప‌టికే అంచ‌నాకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర పార్టీల్లో ఉన్న వైఎస్సార్ మ‌ద్ద‌తుదారులు, అభిమానుల పై ప్ర‌ధానంగా టార్గెట్ పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ష‌ర్మిల పార్టీ పెట్టి యాక్టివిటి పెంచితే ముందుగా న‌ష్ట‌పోయేది కాంగ్రెస్ పార్టీయే అనే ప్ర‌చారం ఊపందుకుంటోంది.

టీఆర్ఎస్ లో చేర‌టం ఇష్టంలేక, కాంగ్రెస్ లో ఉండ‌లేక‌, బీజేపీలో చేర‌లేక ఇప్ప‌టికి నానా అవ‌స్త‌లు ప‌డుతున్న నేత‌లు ప్ర‌ధానంగా రెడ్డి స‌మాజిక‌వ‌ర్గం నేత‌లున్నారు. వీళ్ళ‌లో స‌గం మంది ష‌ర్మిల‌తో చేయి క‌లిపినా పార్టీ లాంచింగే చాలా గ‌ట్టిగా ఉంటుంద‌ని ష‌ర్మిల రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చూస్తున్న కీల‌క నేత‌లు భావిస్తున్నారు. పార్టీ పెట్ట‌కుండా, జెండా ఏమిటో, అజెండా ఏమిటో బ‌య‌ట‌పెట్ట‌లేదు కాబ‌ట్టి అంద‌రికీ ఆస‌క్తిగా ఉంది. అదే ఒక‌సారి అజెండా ఏమిటో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే అపుడు మొద‌ల‌వుతుంది అస‌లు గేమ్. జెండా, అజెండా తయారుచేసే బాధ్యతను షర్మిల ఒక బృందంతో పాటు మరో ఏజెన్సీకి అప్పగించినట్లు చెబుతున్నారు.

అందుక‌నే ఇప్ప‌టినుండే ష‌ర్మిల పార్టీ జోరును పెంచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఒకేసారి లోట‌స్ పాండ్ లో 5 వేల‌మందితో స‌మావేశం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్ప‌టికే తెలంగాణా వ్యాప్తంగా చాలామందితో ష‌ర్మిల ట‌చ్ లోకి వెళ్ళిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఇపుడున్నంత జోరు పార్టీ పెట్టిన త‌ర్వాత కూడా ఉంటుందా అనేదే అనుమానం. పార్టీ పెట్టేనాటికి ష‌ర్మిల‌తో ఎంత‌మంది ప్ర‌ముఖ నేత‌లు చేతులు క‌లుపుతార‌నే దానిపై కొత్త పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డుంది. చూద్దాం ఏమి జ‌రుగుతుందో.

This post was last modified on February 20, 2021 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

50 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago