Political News

5 వేల మందికి ష‌ర్మిల‌ ఆహ్వానాలు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు ష‌ర్మిల తెలంగాణాలో జోరు పెంచారు. తొంద‌ర‌లోనే పార్టీ పెట్టి రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల అందుకు త‌గ్గ‌ట్లే స‌మావేశాల జోరు పెంచారు. మొద‌టి స‌మావేశం న‌ల్గొండ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో జ‌రిపిన ఈమె తాజాగా అంటే ఖ‌మ్మం జిల్లాలోని మ‌ద్ద‌తుదారులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈనెల 20వ తేదీన అంటే ఈరోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోనే హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల వారితో స‌మావేశం అవనున్నారు.

హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అభిమానులు, మ‌ద్ద‌తుదారులు సుమారు 5 వేల‌మందికి ఆహ్వానాలు పంపారు. అలాగే ఇత‌ర పార్టీల్లో నుండి ష‌ర్మిల పెట్ట‌బోయే కొత్త‌పార్టీలోకి వ‌చ్చే వారెవ‌ర‌నే విష‌యంలో ఇప్ప‌టికే అంచ‌నాకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర పార్టీల్లో ఉన్న వైఎస్సార్ మ‌ద్ద‌తుదారులు, అభిమానుల పై ప్ర‌ధానంగా టార్గెట్ పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ష‌ర్మిల పార్టీ పెట్టి యాక్టివిటి పెంచితే ముందుగా న‌ష్ట‌పోయేది కాంగ్రెస్ పార్టీయే అనే ప్ర‌చారం ఊపందుకుంటోంది.

టీఆర్ఎస్ లో చేర‌టం ఇష్టంలేక, కాంగ్రెస్ లో ఉండ‌లేక‌, బీజేపీలో చేర‌లేక ఇప్ప‌టికి నానా అవ‌స్త‌లు ప‌డుతున్న నేత‌లు ప్ర‌ధానంగా రెడ్డి స‌మాజిక‌వ‌ర్గం నేత‌లున్నారు. వీళ్ళ‌లో స‌గం మంది ష‌ర్మిల‌తో చేయి క‌లిపినా పార్టీ లాంచింగే చాలా గ‌ట్టిగా ఉంటుంద‌ని ష‌ర్మిల రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చూస్తున్న కీల‌క నేత‌లు భావిస్తున్నారు. పార్టీ పెట్ట‌కుండా, జెండా ఏమిటో, అజెండా ఏమిటో బ‌య‌ట‌పెట్ట‌లేదు కాబ‌ట్టి అంద‌రికీ ఆస‌క్తిగా ఉంది. అదే ఒక‌సారి అజెండా ఏమిటో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే అపుడు మొద‌ల‌వుతుంది అస‌లు గేమ్. జెండా, అజెండా తయారుచేసే బాధ్యతను షర్మిల ఒక బృందంతో పాటు మరో ఏజెన్సీకి అప్పగించినట్లు చెబుతున్నారు.

అందుక‌నే ఇప్ప‌టినుండే ష‌ర్మిల పార్టీ జోరును పెంచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఒకేసారి లోట‌స్ పాండ్ లో 5 వేల‌మందితో స‌మావేశం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్ప‌టికే తెలంగాణా వ్యాప్తంగా చాలామందితో ష‌ర్మిల ట‌చ్ లోకి వెళ్ళిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఇపుడున్నంత జోరు పార్టీ పెట్టిన త‌ర్వాత కూడా ఉంటుందా అనేదే అనుమానం. పార్టీ పెట్టేనాటికి ష‌ర్మిల‌తో ఎంత‌మంది ప్ర‌ముఖ నేత‌లు చేతులు క‌లుపుతార‌నే దానిపై కొత్త పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డుంది. చూద్దాం ఏమి జ‌రుగుతుందో.

This post was last modified on February 20, 2021 12:27 pm

Share

Recent Posts

జడల్ జమానా మీద మిశ్రమ స్పందనా

న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…

57 minutes ago

వింక్ భామకు పిచ్చి ప్రశ్న

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…

4 hours ago

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

9 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

10 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

11 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

11 hours ago