Political News

5 వేల మందికి ష‌ర్మిల‌ ఆహ్వానాలు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు ష‌ర్మిల తెలంగాణాలో జోరు పెంచారు. తొంద‌ర‌లోనే పార్టీ పెట్టి రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల అందుకు త‌గ్గ‌ట్లే స‌మావేశాల జోరు పెంచారు. మొద‌టి స‌మావేశం న‌ల్గొండ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో జ‌రిపిన ఈమె తాజాగా అంటే ఖ‌మ్మం జిల్లాలోని మ‌ద్ద‌తుదారులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈనెల 20వ తేదీన అంటే ఈరోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోనే హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల వారితో స‌మావేశం అవనున్నారు.

హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అభిమానులు, మ‌ద్ద‌తుదారులు సుమారు 5 వేల‌మందికి ఆహ్వానాలు పంపారు. అలాగే ఇత‌ర పార్టీల్లో నుండి ష‌ర్మిల పెట్ట‌బోయే కొత్త‌పార్టీలోకి వ‌చ్చే వారెవ‌ర‌నే విష‌యంలో ఇప్ప‌టికే అంచ‌నాకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర పార్టీల్లో ఉన్న వైఎస్సార్ మ‌ద్ద‌తుదారులు, అభిమానుల పై ప్ర‌ధానంగా టార్గెట్ పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ష‌ర్మిల పార్టీ పెట్టి యాక్టివిటి పెంచితే ముందుగా న‌ష్ట‌పోయేది కాంగ్రెస్ పార్టీయే అనే ప్ర‌చారం ఊపందుకుంటోంది.

టీఆర్ఎస్ లో చేర‌టం ఇష్టంలేక, కాంగ్రెస్ లో ఉండ‌లేక‌, బీజేపీలో చేర‌లేక ఇప్ప‌టికి నానా అవ‌స్త‌లు ప‌డుతున్న నేత‌లు ప్ర‌ధానంగా రెడ్డి స‌మాజిక‌వ‌ర్గం నేత‌లున్నారు. వీళ్ళ‌లో స‌గం మంది ష‌ర్మిల‌తో చేయి క‌లిపినా పార్టీ లాంచింగే చాలా గ‌ట్టిగా ఉంటుంద‌ని ష‌ర్మిల రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చూస్తున్న కీల‌క నేత‌లు భావిస్తున్నారు. పార్టీ పెట్ట‌కుండా, జెండా ఏమిటో, అజెండా ఏమిటో బ‌య‌ట‌పెట్ట‌లేదు కాబ‌ట్టి అంద‌రికీ ఆస‌క్తిగా ఉంది. అదే ఒక‌సారి అజెండా ఏమిటో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే అపుడు మొద‌ల‌వుతుంది అస‌లు గేమ్. జెండా, అజెండా తయారుచేసే బాధ్యతను షర్మిల ఒక బృందంతో పాటు మరో ఏజెన్సీకి అప్పగించినట్లు చెబుతున్నారు.

అందుక‌నే ఇప్ప‌టినుండే ష‌ర్మిల పార్టీ జోరును పెంచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఒకేసారి లోట‌స్ పాండ్ లో 5 వేల‌మందితో స‌మావేశం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్ప‌టికే తెలంగాణా వ్యాప్తంగా చాలామందితో ష‌ర్మిల ట‌చ్ లోకి వెళ్ళిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఇపుడున్నంత జోరు పార్టీ పెట్టిన త‌ర్వాత కూడా ఉంటుందా అనేదే అనుమానం. పార్టీ పెట్టేనాటికి ష‌ర్మిల‌తో ఎంత‌మంది ప్ర‌ముఖ నేత‌లు చేతులు క‌లుపుతార‌నే దానిపై కొత్త పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డుంది. చూద్దాం ఏమి జ‌రుగుతుందో.

This post was last modified on February 20, 2021 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

34 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

1 hour ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

3 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

6 hours ago