Political News

పంచాయ‌తీ చిత్రం: ఓటు కోసం.. శ్రీవారి ల‌డ్డూ ఎర‌..!!

ఓట్ల కోసం.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు పార్టీలు వేయ‌ని ఎత్తులు లేవు. ఈ క్ర‌మంలోనే బంగారం నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. న‌గ‌దు నుంచి చీర‌ల వ‌ర‌కు ఇలా.. అనేక రూపాల్లో.. రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ ప‌రుచుకుని.. త‌మ ప‌బ్బం గ‌డుపుకొన్న విశేషాలు అనేకం.. తాజాగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లోనూ మ‌న‌కు క‌నిపించాయి.

అయితే.. ఏకంగా తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూను కూడా ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం వాడుకున్న ప్ర‌బుద్ధులైన నాయ‌కులు ఉన్నారా? అంటే.. ఉన్నార‌నే అంటున్నారు తిరుప‌తి ప్ర‌జ‌లు. ఇక్క‌డి వైసీపీ నాయ‌కుడు.. ఫైర్ బ్రాండ్ నేత‌.. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటిదే జ‌రిగింది.

చంద్రగిరి నియోజకవర్గం, తొండవాడ పంచాయతీలో ఎన్నికల కోసం దేవుడికి కూడా రాజకీయాలు అంటగడుతున్నారు. తిరుపతి లడ్డూకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం, తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్ స్లిప్‌తోపాటు శ్రీవారి లడ్డూలను పంచిపెడుతున్నారు. ‘లడ్డూ తీసుకోండి.. మాకు ఓటువేయండి’ అని ప్ర‌చారం చేస్తున్నారు. అంటున్నారు. తొండవాడలో ఓటర్లకు శ్రీవారి లడ్డూలు పంపిణీ చేసేందుకు ఏకంగా రేషన్ సరఫరా చేసే వాహనాలను ఉపయోగిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

కరోనా తర్వాత తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడ స్వామివారి లడ్డూలు దొరక్కా భక్తులు ఇబ్బందిపడుతున్నారు. వైసీపీ నేతలకు మాత్రం లడ్డూలకు కరువేలేదు. దర్జాగా తిరుమల నుంచి తీసుకువచ్చి పంచుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు చూసీ, చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి దింపారంటూ.. వైసీపీ నేతల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా.. కూడా వైసీపీ నేత‌లు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. శ్రీవారి ల‌డ్డూతో పాటు స్లిప్పులు పంచుతున్నారు. కాగా, ఇక్క‌డ నాలుగో ద‌శ‌లో అంటే.. ఈ నెల 21న పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రి శ్రీవారి ల‌డ్డూ.. ఏమేర‌కు ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి.

This post was last modified on February 19, 2021 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago