ఓట్ల కోసం.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు పార్టీలు వేయని ఎత్తులు లేవు. ఈ క్రమంలోనే బంగారం నుంచి మద్యం వరకు.. నగదు నుంచి చీరల వరకు ఇలా.. అనేక రూపాల్లో.. రాజకీయ నేతలు.. ప్రజలను ప్రలోభ పరుచుకుని.. తమ పబ్బం గడుపుకొన్న విశేషాలు అనేకం.. తాజాగా పంచాయతీ ఎన్నికలలోనూ మనకు కనిపించాయి.
అయితే.. ఏకంగా తిరుమల శ్రీవారి లడ్డూను కూడా ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకున్న ప్రబుద్ధులైన నాయకులు ఉన్నారా? అంటే.. ఉన్నారనే అంటున్నారు తిరుపతి ప్రజలు. ఇక్కడి వైసీపీ నాయకుడు.. ఫైర్ బ్రాండ్ నేత.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటిదే జరిగింది.
చంద్రగిరి నియోజకవర్గం, తొండవాడ పంచాయతీలో ఎన్నికల కోసం దేవుడికి కూడా రాజకీయాలు అంటగడుతున్నారు. తిరుపతి లడ్డూకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం, తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్ స్లిప్తోపాటు శ్రీవారి లడ్డూలను పంచిపెడుతున్నారు. ‘లడ్డూ తీసుకోండి.. మాకు ఓటువేయండి’ అని ప్రచారం చేస్తున్నారు. అంటున్నారు. తొండవాడలో ఓటర్లకు శ్రీవారి లడ్డూలు పంపిణీ చేసేందుకు ఏకంగా రేషన్ సరఫరా చేసే వాహనాలను ఉపయోగిస్తుండడం గమనార్హం.
కరోనా తర్వాత తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడ స్వామివారి లడ్డూలు దొరక్కా భక్తులు ఇబ్బందిపడుతున్నారు. వైసీపీ నేతలకు మాత్రం లడ్డూలకు కరువేలేదు. దర్జాగా తిరుమల నుంచి తీసుకువచ్చి పంచుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు చూసీ, చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి దింపారంటూ.. వైసీపీ నేతల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా.. కూడా వైసీపీ నేతలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. శ్రీవారి లడ్డూతో పాటు స్లిప్పులు పంచుతున్నారు. కాగా, ఇక్కడ నాలుగో దశలో అంటే.. ఈ నెల 21న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మరి శ్రీవారి లడ్డూ.. ఏమేరకు ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి.
This post was last modified on February 19, 2021 7:29 pm
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…