కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినపుడు ఆయన ప్రసంగాల్ని స్థానిక భాషల్లో తర్జుమా చేయడానికి, అలాగే జనాలు ఇక్కడి భాషల్లో చెప్పే విషయాలను హిందీ లేదా ఇంగ్లిష్లో చెప్పడానికి పక్కనే పేరున్న నాయకులు నిలబడుతుంటారు. ఐతే కొన్నిసార్లు ఈ అనువాదాలు తేడా కొట్టేసి రాహుల్ చాలా ఇబ్బంది పడిపోయిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చాలానే కనిపిస్తాయి.
గత నెలలో తమిళనాట పర్యటించిన సందర్భంగానే ఈ అనువాద ఇబ్బంది తప్పలేదు రాహుల్కు. కాగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో ప్రచారం కోసం రాహుల్ వెళ్లిన సందర్భంగా చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. రాహుల్ పక్కన అనువాదకుడిగా నిలబడ్డ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి.. ఓ మహిళ అన్న మాటల్ని తప్పుగా అనువాదం చేసి తన పరువు తనే తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఈ వీడియోలో అసలేముందో చూద్దాం పదండి.
పుదుచ్చేరిలో రాహుల్ పర్యటన సందర్భంగా జనాల సమస్యల గురించి చెప్పమన్నాడు. ఈ సందర్భంగా ఓ మహిళ ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ మాట్లాడింది. తమను ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని, సీఎం సహా ఎవరూ తమ కోసం రాలేదని ఆగ్రహం, ఆవేదనతో స్పందించింది. ఆమె హావభావాలు చూస్తేనే ఏదో తేడాగా ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది. ఐతే ఆమె చెబుతున్న విషయాలను రాహుల్కు అనువాదం చేయాల్సిన నారాయణస్వామి.. అసలు విషయాన్ని మార్చి చెప్పారు. తుపాను సమయంలో తమ ప్రాంతాల్లో పర్యటించి, తమకు అండగా నిలిచినందుకు ఆ మహిళ కృతజ్ఞతలు చెబుతోందని రాహుల్కు ఇంగ్లిష్లో వివరించాడు. ఈ సందర్భంగా సభలో గట్టిగా అరుపులు, చప్పట్లు వినిపించాయి.
ఐతే పెద్ద ఎత్తున మీడియా ఉన్న కార్యక్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించిన విషయాన్ని మరుగున పరిచి తమను ప్రశంసించినట్లుగా సీఎం ప్రొజెక్ట్ చేసుకోవడంతో దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారాయణస్వామిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జాతీయ స్థాయిలో ఈ వీడియో వైరల్ అయింది.
This post was last modified on February 18, 2021 8:04 am
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…