Political News

ఏపీ బీజేపీ నేతల డ్రామాకు నడ్డా చెక్ !

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంతపార్టీ నేతలకే పెద్ద షాక్ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తు కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై గడచిన 15 రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఉక్కు ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళనలకు రాజకీయపార్టీలు కూడా జత కలిశాయి. అధికార, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నా బీజేపీ+జనసేన మాత్రం ఎక్కడా కనబడటం లేదు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించింది కాబట్టి రాష్ట్రంలో బీజేపీ నేతలు ఆందోళనలంటే జనాలు నవ్వుతారు. అందుకనే నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రైవేటీకరణను నిలిపేస్తామంటూ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో భీకర ప్రకటన చేశారు. అయితే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నడ్డాతో భేటి అయినపుడు పెద్ద షాక్ తగిలింది. తనతో పార్టీకి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించాలని స్పష్టంగా చెప్పేశారు.

అయినా ఉక్కు ఆందోళనల గురించి వీర్రాజు ప్రస్తావించేందుకు చేసిన ప్రయత్నాలను నడ్డా అడ్డుకున్నారు. పార్టీ వ్యవహరాలుంటే తనతో మాట్లాడమని ఇతర అంశాలు ఏవైనా మాట్లాడాలంటే సంబంధిత మంత్రులతో మాత్రమే చర్చించమని రెండోసారి గట్టిగా చెప్పారట. డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు తనతో మాట్లాడినా ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా నడ్డా స్పష్టంగా చెప్పేశారట. తాను ఏ మంత్రిత్వశాఖ విషయాల్లో జోక్యం చేసుకునేది లేదని చెప్పటంతో నేతలకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు.

నిజానికి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో నరేంద్రమోడిదే ఫైనల్ డెసిషన్. మోడి తీసుకున్న నిర్ణయంపై మంత్రులను కలిసినందువల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ విషయం తెలిసి కూడా వీర్రాజు అండ్ కో డ్రామాలాడుతున్నారు. మోడిని కలిసి మాట్లాడేంత సీన్ మన నేతలకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏదేదో చేసేస్తామని చెప్పి ఢిల్లీకి వెళ్ళిన కమలనాదులకు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.

This post was last modified on February 17, 2021 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

3 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

44 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

6 hours ago