షర్మిల ముహూర్తబలం కోసం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణాలోని వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో భేటీలు నిర్వహిస్తున్న షర్మిలకు చాలామంది చాలా సూచనలు చేస్తున్నారట. అంతిమంగా ఎవరు ఏమి చెబుతున్నా పార్టీ ప్రకటనకు ముందుగానే కీలకమైన నేతలను తనతో కలిసి నడిచేందుకు చేయి కలపాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం.
పనిలో పనిగా పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తబలాన్ని చూస్తున్నట్లు చెబుతున్నారు. ముందు పాదయాత్ర చేయాలా ? లేకపోతే పార్టీని ప్రకటించాలా అన్న విషయంలోనే షర్మిల కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ ప్రకటనకైనా పాదయాత్రకైనా రెండు ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 8వ తేదీ, మే 14వ తేదీలను సీరియస్ గా పరిశీలిస్తున్నారట.
మే 14వ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆరోజున వైఎస్సార్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక రెండో ముహూర్తం జూలై 8వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే ఆరోజు వైఎస్సార్ జయంతి. జయంతి రోజే పార్టీ పేరును ప్రకటిస్తే బాగుంటుందని షర్మిల అనుకుంటున్నారట. అయితే అప్పటికి చాలా ఆలస్యమైపోతుందని కీలక నేతలు చెబుతున్నారట. మే 14వ తేదీన అయితే మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన తేదీనే పార్టీ ప్రకటన చేసినా లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని చెబుతున్నారట.
పై రెండు తేదీల్లో దేనివైపు మొగ్గు చూపుతారో ఎవరికీ తెలీటం లేదు. ఎందుకంటే షర్మిల అనుకున్న జూలై 8వ తేదీ విషయంలో నేతల్లో కొందరి మధ్య చిన్నపాటి అభ్యంతరాలున్నట్లు సమాచారం. కాబట్టి ఏ విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. మొత్తం మీద పై రెండు తేదీలనే షర్మిల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 16, 2021 11:50 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…