షర్మిల ముహూర్తబలం కోసం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణాలోని వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో భేటీలు నిర్వహిస్తున్న షర్మిలకు చాలామంది చాలా సూచనలు చేస్తున్నారట. అంతిమంగా ఎవరు ఏమి చెబుతున్నా పార్టీ ప్రకటనకు ముందుగానే కీలకమైన నేతలను తనతో కలిసి నడిచేందుకు చేయి కలపాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం.
పనిలో పనిగా పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తబలాన్ని చూస్తున్నట్లు చెబుతున్నారు. ముందు పాదయాత్ర చేయాలా ? లేకపోతే పార్టీని ప్రకటించాలా అన్న విషయంలోనే షర్మిల కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ ప్రకటనకైనా పాదయాత్రకైనా రెండు ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 8వ తేదీ, మే 14వ తేదీలను సీరియస్ గా పరిశీలిస్తున్నారట.
మే 14వ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆరోజున వైఎస్సార్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక రెండో ముహూర్తం జూలై 8వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే ఆరోజు వైఎస్సార్ జయంతి. జయంతి రోజే పార్టీ పేరును ప్రకటిస్తే బాగుంటుందని షర్మిల అనుకుంటున్నారట. అయితే అప్పటికి చాలా ఆలస్యమైపోతుందని కీలక నేతలు చెబుతున్నారట. మే 14వ తేదీన అయితే మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన తేదీనే పార్టీ ప్రకటన చేసినా లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని చెబుతున్నారట.
పై రెండు తేదీల్లో దేనివైపు మొగ్గు చూపుతారో ఎవరికీ తెలీటం లేదు. ఎందుకంటే షర్మిల అనుకున్న జూలై 8వ తేదీ విషయంలో నేతల్లో కొందరి మధ్య చిన్నపాటి అభ్యంతరాలున్నట్లు సమాచారం. కాబట్టి ఏ విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. మొత్తం మీద పై రెండు తేదీలనే షర్మిల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 16, 2021 11:50 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…