ఇపుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఒక పద్దతి. తొందరలో మొదలవ్వబోయే యుద్ధం మరో పద్దతి. ఇపుడే అసలైన ఎన్నికల యుద్ధం మొదలవ్వబోతోంది. పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. దాదాపు 15 రోజుల క్రితం మొదలైన పంచాయితీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవన్న విషయం తెలిసిందే.
ఎప్పుడైతు గుర్తులు లేవో గెలిచిన వారంతా తమ వారే అని అధికార వైసీపీ, కాదు కాదు తమకు 38 శాతం పంచాయితీలు వచ్చాయని ప్రధాన ప్రతినపక్షం తెలుగుదేశంపార్టీ వాదులాడుకుంటున్న విషయాన్ని చూస్తున్నదే. సరే ఈ విషయన్ని పక్కన పెట్టేస్తే తొందరలోనే మొదలవ్వబోయే మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరుగుతుంది. దాంతో ఏ పార్టీ ఎన్ని ఛైర్మన్ స్ధానాలను గెలుచుకున్నది, వార్డులను గెలుచుకున్నదనే విషయంలో స్పష్టత వచ్చేస్తుంది.
ఇప్పటిలా రెండుపార్టీలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు క్లైం చేసుకునేందుకు ఉండదు. పంచాయితి ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు ఎన్నికల్లో నిలబడటానికి చాలా చోట్ల ఎవరు ముందుకు రాలేదని వైసీపీ అంటోంది. కానీ ఇక్కడే గెలిచిన పంచాయితీల మద్దతుదారుల విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడని వాళ్ళు గెలిచింది కేవలం 15 శాతం పంచాయితీల్లోనే అని వైసీపీ నేతలంటున్నారు. గెలిచిన తమ మద్దతుదారుల వివరాలను ఫొటోలతో సహా తాము చూపించగలం అని చంద్రబాబు అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి గందరగోళానికి అవకాశం లేదు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుండి ఛైర్మన్ గా పోటీ చేసే వాళ్ళందరు పార్టీల గుర్తుల మీదే పోటీ చేయాలి. కాబట్టి పార్టీల కెపాసిటి ఏమిటో తేలిపోతుంది. సహజంగానే లోకల్ బాడీ ఎలక్షన్సంటే అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుందన్నది వాస్తవం. కాబట్టి రేపటి ఎన్నికల్లో కూడా వైసీపీ తన ఆధిక్యతను నిరూపించుకుంటుందా? తెలుగుదేశం పై చేయి సాధిస్తుందా? అన్నది తేలనుంది.
This post was last modified on February 15, 2021 2:14 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…