ఇపుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఒక పద్దతి. తొందరలో మొదలవ్వబోయే యుద్ధం మరో పద్దతి. ఇపుడే అసలైన ఎన్నికల యుద్ధం మొదలవ్వబోతోంది. పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. దాదాపు 15 రోజుల క్రితం మొదలైన పంచాయితీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవన్న విషయం తెలిసిందే.
ఎప్పుడైతు గుర్తులు లేవో గెలిచిన వారంతా తమ వారే అని అధికార వైసీపీ, కాదు కాదు తమకు 38 శాతం పంచాయితీలు వచ్చాయని ప్రధాన ప్రతినపక్షం తెలుగుదేశంపార్టీ వాదులాడుకుంటున్న విషయాన్ని చూస్తున్నదే. సరే ఈ విషయన్ని పక్కన పెట్టేస్తే తొందరలోనే మొదలవ్వబోయే మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరుగుతుంది. దాంతో ఏ పార్టీ ఎన్ని ఛైర్మన్ స్ధానాలను గెలుచుకున్నది, వార్డులను గెలుచుకున్నదనే విషయంలో స్పష్టత వచ్చేస్తుంది.
ఇప్పటిలా రెండుపార్టీలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు క్లైం చేసుకునేందుకు ఉండదు. పంచాయితి ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు ఎన్నికల్లో నిలబడటానికి చాలా చోట్ల ఎవరు ముందుకు రాలేదని వైసీపీ అంటోంది. కానీ ఇక్కడే గెలిచిన పంచాయితీల మద్దతుదారుల విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడని వాళ్ళు గెలిచింది కేవలం 15 శాతం పంచాయితీల్లోనే అని వైసీపీ నేతలంటున్నారు. గెలిచిన తమ మద్దతుదారుల వివరాలను ఫొటోలతో సహా తాము చూపించగలం అని చంద్రబాబు అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి గందరగోళానికి అవకాశం లేదు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుండి ఛైర్మన్ గా పోటీ చేసే వాళ్ళందరు పార్టీల గుర్తుల మీదే పోటీ చేయాలి. కాబట్టి పార్టీల కెపాసిటి ఏమిటో తేలిపోతుంది. సహజంగానే లోకల్ బాడీ ఎలక్షన్సంటే అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుందన్నది వాస్తవం. కాబట్టి రేపటి ఎన్నికల్లో కూడా వైసీపీ తన ఆధిక్యతను నిరూపించుకుంటుందా? తెలుగుదేశం పై చేయి సాధిస్తుందా? అన్నది తేలనుంది.
This post was last modified on February 15, 2021 2:14 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…