Political News

గంటా షాకింగ్ నిర్ణయం.. ఉప ఎన్నికల్లో పోటీ చేయరట

మన దగ్గరి రూపాయిని అన్యాయంగా తీసుకుంటే వేదన చెందుతాం. ఇదెక్కడి అన్యాయమని బాధ పడతాం. అంతకు మించి ఆవేశానికి గురి అవుతాం. అలాంటిది.. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేయాలని డిసైడ్ అయితే.. ఏపీ ప్రజలు ఎంతలా స్పందించాలి. మరెంత ఆగ్రహాన్ని ప్రదర్శించాలి. కానీ.. ఇంత జరుగుతున్నా.. గుంభనంగా ఉంటున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలాంటి వేళ.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇప్పటివరకు ఆయన రాజీనామాను ఆమోదించింది లేదు. అయితే.. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారన్న ఆశను గంటా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో అన్ని పార్టీల పాపం ఉందన్న ఆయన.. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తన వ్యక్తిగతమని.. రానున్న ఉప ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు గంటా.

తనకు బదులుగా.. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని బరిలోకి దించాలన్న సూచన చేశారు. సీఎం జగన్ తన రాజకీయ పంథాను వదిలేసి.. ఉద్యమ పంథాలోకి రావాలన్న ఆకాంక్షను గంటా వ్యక్తం చేస్తున్నారు. తన స్ఫూర్తితో మిగిలిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని ఆయన కోరుతున్నారు. పోరాటాల ద్వారానే స్టీల్ ఫ్లాంట్ ను నిలబెట్టుకోగలమన్న వాదనను ఆయన వినిపిస్తున్నారు.

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటివేళ.. పదవుల్లో ఉండే కన్నా ప్రజల్లో ఉండటం.. వారి ఆకాంక్షకు తగ్గట్లుగా పోరాటాలు చేయాలని భావిస్తున్న గంటా.. తనకు పదవుల కంటే కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకపోవటమే ముఖ్యమన్న బలమైన సందేశాన్ని ప్రజలకు పంపించే ప్రయత్నమే ఉప ఎన్నికకు దూరంగా ఉండటంగా చెబుతున్నారు. మరి.. ఆయన వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 15, 2021 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

8 minutes ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

55 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

1 hour ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

3 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

3 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago