నెలన్నరగా కరోనా వైరస్ వల్ల పడుతున్న కష్టాలు చాలవని.. విశాఖపట్నం వాసులను ఇప్పుడో పెద్ద ఉపద్రవం ముంచెత్తింది. గోపాల పట్నం ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టెరీన్ గ్యాస్ 11 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఈ గ్యాస్ను ఎక్కువ మోతాదులో తీసుకుని ఉంటే అవయవాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. దీర్ఘ కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు రావచ్చు. క్యాన్సర్ బారిన కూడా పడొచ్చు. ఇంకేవైనా ప్రతికూల ప్రభావాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. స్టెరీన్ గ్యాస్ అంత ప్రమాదకరమైంది మరి. ఈ సమయంలో మిగతా జనం కూడా వైజాగ్ ఉదంతం నుంచి ఓ పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ప్లాసిక్, రబ్బర్ ఉపకరణాల తయారీలో స్టెరీన్ గ్యాస్నే ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ పైపులు, ఆలోమొబైల్ పార్టులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్, వైర్లతో పాటు నీళ్లు, టీ కాఫీలు తాగే ప్లాస్టిక్ కప్పుల్లో స్టెరీన్ గ్యాస్ను వాడతారు. అందుకే ప్లాస్టిక్ ఉపకరణాలు వేటిలోనూ వేడి ఆహార పదార్థాలు ఏవీ పోయకూడదని అంటారు.
అసలు తినే వస్తువులేవీ కూడా ప్లాస్టిక్ ఉపకరణాల్లో ఉపయోగించకూడదని ఎప్పుడూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మనం వినం. ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగినా.. కవర్లలో ఏ వేడి ఆహార పదార్థాలు ప్యాక్ చేసి ఆ తర్వాత తిన్నా చాలా ప్రమాదం అని తెలిసినా ఏం కాదన్నట్లుగా లైట్ తీసుకుంటూ ఉంటాం. తర్వాత ఏ క్యాన్సరో, మరో పెద్ద జబ్బో ఎటాక్ అయితే.. ఏం తప్పు చేశామని దేవుడు ఇంత శిక్ష విధించాడని మొత్తుకుంటాం. అప్పుడు ఆ జబ్బులు రావడానికి కారణం ఏంటన్నది ఎవ్వరూ చెప్పలేరు. జీవితంలో నిర్లక్ష్యంతో చేసే చిన్న చిన్న పొరబాట్లే ఇలాంటి దారుణమైన ఫలితాలిస్తుంటాయి. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే మంచిది.
This post was last modified on May 8, 2020 10:53 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…