ఏపీ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ను దారుణంగా హతమార్చిన ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.ఆర్థిక లావాదేవీలు.. పాతకక్షలతో హత్య చేసినా.. ఇంత దారుణంగా చంపేయటమా? అన్నది ప్రశ్నగా మారింది. కాకినాడ తొమ్మిదో వార్డుకు కంపర రమేశ్ వ్యవహరిస్తున్నారు. వైసీపీకి చెందిన ఈ సీనియర్ కార్పొరేటర్ గురువారం రాత్రి కార్ వాష్ కోసం కాకినాడ గంగరాజు నగర్ సెంటర్ కి వచ్చారు. ఆయన వెంటన మరో ఇద్దరు ఉన్నారు.
ఇదిలా ఉంటే కార్పొరేటర్ కు.. చిన్న అనే వ్యక్తికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవాలకు సంబంధించి పలు మెసేజ్ ల్ని కార్పొరేటర్ కు చిన్నా పంపారు. అయినప్పటికి ఆయన స్పందించలేదు. చివరకు గురువారం రాత్రి చిన్నాకు ఫోన్ చేసిన కార్పొరేటర్ కారు వాష్ సెంటర్ వద్దకు రమ్మన్నారు. అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చిన్న.. తన సోదరుడితో కలిసి వచ్చారు. అప్పటికే వారిద్దరూ పూటుగా తాగి ఉన్నారు. మాటలతో మొదలై.. కాసేపటికే గొడవగా మారింది.
కాసేపటికే ఇరువురు బాహాబాహీకి దిగారు. అక్కడే ఉన్న స్నేహితులు వారిద్దరిని వారించే ప్రయత్నం చేయగా.. వినలేదు. తన కారు తాళం కనిపించలేదని చిన్న కారుకు రమేశ్ అడ్డుగా నిలిచారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న చిన్న.. కారును స్టార్ట్ చేయటమే కాదు.. స్పీడ్ గా కార్పొరేటర్ మీదకు దూసుకెళ్లారు. దీంతో.. ఒక్కసారిగా రమేశ్ పక్కకు పడ్డారు. అయినప్పటికి వదలని చిన్నా.. కారును రివర్సు తీసుకొని వేగంగా తీసుకొచ్చి.. కార్పొరేటర్ ను తొక్కించేసి వెళ్లిపోయాడు.
ఈ సందర్భంగా రమేశ్ స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రమేశ్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రశాంతంగా ఉండే కాకినాడలో ఇంత ఆరాచకం చోటు చేసుకోవటం.. అధికార వైసీపీకి చెందిన కార్పొరేటర్ ను దారుణంగా హతమార్చటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on February 13, 2021 11:01 am
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…