ఈనెల 21వ తేదీన షర్మిల ఖమ్మం జిల్లా పర్యటనపై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. మొన్నటి 9వ తేదీన తెలంగాణా రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజన్న రాజ్యం తేవటమే తన లక్ష్యంగా షర్మిల ప్రకటించారు. పార్టీ, జెండా, విధి విదానాలు ఇంకా ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతల్లోల మాత్రం షర్మిలపై వ్యతిరేకత పెరిగిపోతోంది. షర్మిలను టార్గెట్ గా చేసుకుని టీఆర్ఎస్+బీజేపీ+కాంగ్రెస్ నేతలు ఆరోపణలను, విమర్శలను మొదలుపెట్టేయటమే ఆశ్చర్యంగా ఉంది.
మొదటి సమావేశం నల్గొండ జిల్లాలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానులతో ఏర్పాటు చేసిన షర్మిల తన రెండో సమావేశానికి నేరుగా ఖమ్మం బయలుదేరి వెళుతున్నారు. ఖమ్మం జిల్లాలోని నేతలతో షర్మిల భేటీకి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోటస్ పాండ్ నుండి భారీ కాన్వాయ్ తో ఆమె ఖమ్మం చేరుకునేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
జిల్లాలోని గిరిజన సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 43 మండలాల్లో సుమారు 30 మండలాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో జగన్ తెలంగాణాపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా జిల్లాలోని ఖమ్మం ఎంపితో పాటు మూడు అసెంబ్లీ స్ధానాల్లో గెలుచుకుంది. ఇందుకనే ఈ జిల్లాపై షర్మిల ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.
This post was last modified on February 12, 2021 5:49 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…