Political News

ఈ ఎన్నికలతో జననాడి దొరుకుతుందా ?

తొందరలోనే రెండు శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది. రెండు ఎంఎల్సీ స్ధానాలు కూడా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లోనే జరగబోతోంది. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక స్ధానం, తూర్పు+పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకస్ధానానికి ఎన్నిక జరగబోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు జరుగుతున్న పంచాయితి ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు గెలిచినా పార్టీ బ్యానర్ ఉండదు. అయితే గెలిచిన వాళ్ళంతా తమ వాళ్ళే అని క్లైం చేసుకునే అవకాశం ప్రతి పార్టీకి ఉంటుంది. కాకపోతే అధికారపార్టీకి బాగా ఎక్కువ అవకాశం ఉంటుందంతే. ఇపుడు జరుగుతున్న క్లైం కూడా ఇలాంటిదే. తమకు 38 శాతం ఓట్లు వచ్చిందని చంద్రబాబునాయుడు చెబుతుంటే కాదు కాదు టీడీపీకి వచ్చింది 16 శాతమే అని వైసీపీ అంటోంది.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జరగబోయే ఎంఎల్సీ ఎన్నికలో ఎలాగూ పార్టీ బేసుడే జరుగుతుంది. అందునా కృష్ణా-గుంటూరులో ఒకస్ధానం ఉండటమే ఆసక్తిగా మారింది. పై రెండు జిల్లాలు రాజధాని జిల్లాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి రాజధాని అమరావతిలో గడచిన 400 రోజులుగా స్ధానికులు+రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి దీని ప్రభావాన్ని కూడా ఎవరికి వారుగా తమిష్టం వచ్చినట్లు లెక్కేసుకుంటున్నారు.

ఈ పరిస్ధితుల్లో పార్టీ బ్యానర్ పై జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సత్తా చాటుతారా ? అన్నది కీలకంగా మారింది. ఇపుడు పంచాయితి ఎన్నికల్లో రాజధాని 28 గ్రామాలను మినహాయించారు కాబట్టి జనాల తీర్పు ఏమిటో తెలీలేదు. మరి వచ్చే నెలలలోనే జరగబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో జనాలు తమ తీర్పును స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. కాబట్టే ఇప్పటి నుండే వైసీపీ, టీడీపీతో పాటు జనసేన+బీజేపీ కూడా కసరత్తు మొదలుపెట్టేశాయి. చూద్దాం ఎన్నిక ఎంత రసవత్తరంగా సాగుతుందో.

This post was last modified on February 12, 2021 5:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

7 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

7 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

9 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

9 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

11 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

12 hours ago