తిరుమల తిరుపతి దేవస్ధానంపై బీజేపీ మాతృసంస్ధ ఆర్ఎస్ఎస్ కన్నుపడిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్ నేతల నుండి. తిరుపతి మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ మాట్లాడుతూ చేసిన ఆరోపణలు తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి బలహీనత కారణంగా టీటీడీనీ సొంతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానంను రాష్ట్రప్రభుత్వం పరిధినుండి తప్పించి కేంద్రప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో భగవత్ ఆధ్వర్యంలో 7-9 తేదీల మధ్య రహస్య సమావేశం జరిగినట్లు చెప్పారు. టీటీడీని రాష్ట్రప్రభుత్వం నుండి తప్పించేందుకు ఉన్న అవకాశాలు, న్యాయపరమైన చిక్కులపై ప్రముఖ న్యాయ నిపుణులతో భగవత్ చర్చించినట్లు మోహన్ ఆరోపించారు.
టీటీడీకి ఉన్న రూ. 10 వేల కోట్ల డిపాజిట్లు, వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వందల కోట్ల స్ధిరాస్తులపై ఆర్ఎస్ఎస్ కన్నుపడిందన్నారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ఎలాగ ప్రైవేటుపరం చేయబోతున్నారో అలాగే టీటీడీని కూడా రాష్ట్రప్రభుత్వం పరిధి నుండి తప్పించేందుకు కుట్రలు మొదలైపోయినట్లు చెప్పారు. జగన్ బలహీనత వల్లే కేంద్రం ఇదంతా చేస్తోందంటు మండిపడ్డారు. తాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా జగన్ లాంటి బలహీన సీఎంను మాత్రం చూడలేదన్నారు.
This post was last modified on February 12, 2021 5:26 pm
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…