తిరుమల తిరుపతి దేవస్ధానంపై బీజేపీ మాతృసంస్ధ ఆర్ఎస్ఎస్ కన్నుపడిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్ నేతల నుండి. తిరుపతి మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ మాట్లాడుతూ చేసిన ఆరోపణలు తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి బలహీనత కారణంగా టీటీడీనీ సొంతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆరోపించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానంను రాష్ట్రప్రభుత్వం పరిధినుండి తప్పించి కేంద్రప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో భగవత్ ఆధ్వర్యంలో 7-9 తేదీల మధ్య రహస్య సమావేశం జరిగినట్లు చెప్పారు. టీటీడీని రాష్ట్రప్రభుత్వం నుండి తప్పించేందుకు ఉన్న అవకాశాలు, న్యాయపరమైన చిక్కులపై ప్రముఖ న్యాయ నిపుణులతో భగవత్ చర్చించినట్లు మోహన్ ఆరోపించారు.
టీటీడీకి ఉన్న రూ. 10 వేల కోట్ల డిపాజిట్లు, వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వందల కోట్ల స్ధిరాస్తులపై ఆర్ఎస్ఎస్ కన్నుపడిందన్నారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ఎలాగ ప్రైవేటుపరం చేయబోతున్నారో అలాగే టీటీడీని కూడా రాష్ట్రప్రభుత్వం పరిధి నుండి తప్పించేందుకు కుట్రలు మొదలైపోయినట్లు చెప్పారు. జగన్ బలహీనత వల్లే కేంద్రం ఇదంతా చేస్తోందంటు మండిపడ్డారు. తాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా జగన్ లాంటి బలహీన సీఎంను మాత్రం చూడలేదన్నారు.
This post was last modified on February 12, 2021 5:26 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…