రాష్ట్రంలో జరుగుతన్న పంచాయతీ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా..చంద్రబాబు.. ఊహించని విధంగా జగన్ సొంత జిల్లా కడపలో సైకిల్ పరుగులు పెట్టింది. అసలు అడ్రస్ కూడా ఉంటుందో ఉండదో అని అనుకున్న కడపలో ఆశించిన విధంగానే టీడీపీ ఫలితాలు రాబట్టడంతో.. చంద్రబాబు సహా అందరూ ఊపిరి పీల్చుకోవడం గమనార్హం. గత ఎన్నికల తర్వాత.. టీడీపీ కీలక నేతలు కడపలో హ్యాండిచ్చారు. సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వంటివారు.. పార్టీ నుంచి జంప్ చేశారు.
దీంతో కడపపై చంద్రబాబు.. పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విషయంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ పెంచిన చంద్రబాబు.. ఒక్క కడపపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కడపపై దృష్టి పెట్టే.. చంద్రబాబు ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు. అయితే.. అనూహ్యంగా పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో కడపలో టీడీపీ మద్దతు దారులు విజయం సాధించారు. ఏకగ్రీవాలు పోనూ 155 సర్పంచి స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగితే టీడీపీ మద్దతుదారులు 98 స్థానాలకు పోటీ చేశారు. 27 స్థానాల్లో విజయం సాధించారు.
ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. టీడీపీ శ్రేణుల్లోనే కాదు.. చంద్రబాబులోనూ ఆనందాన్ని నింపాయి. అసలుఏమీలేదని చేతులు ఎత్తేసిన.. కడపలో ఇలాంటి ఫలితాలు వస్తాయని వారు ఊహించలేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 19 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మద్దతుదారులు 5 స్థానాల్లో గెలిచారు. బద్వేలు నియోజకవర్గంలో 68 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు 46 స్థానాల్లో పోటీ చేసి 10 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మొత్తానికి ఊహించని జిల్లాలో అనూహ్య ఫలితం రావడం.. సైకిల్ పరుగులు పెట్టడం టీడీపీలో కొత్త జోష్ పెంచిందనే చెప్పాలి.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…