ఈరోజు ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అదేపనిగా ఆళ్ళ మంగళగిరి నుండి హైదరాబాద్ కు వచ్చి షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి 9వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెళ్ళిరోజున తెలంగాణాలో రాజకీయ అరంగేట్రాన్ని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.
మామూలుగా అయితే షర్మిల తో ఆళ్ళ భేటి పెద్ద విశేషం ఏమీకాదు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో మాత్రం కచ్చితంగా ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లాకు షర్మిల వెళుతున్నారు. ఇటువంటి సమయంలో ఆళ్ళ స్వయంగా లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి వెళ్ళటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ఎంఎల్ఏ ఆళ్ళ చాలా సన్నిహితుడన్న విషయం తెలిసిందే. షర్మిలతో మాట్లాడేందుకు తన తరపున జగన్ మంగళగిరి ఎంఎల్ఏను పంపించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా దాదాపు గంటసేపు షర్మిలతో ను తర్వాత ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్ తోను ఆళ్ళ విడివిడిగా భేటి అయ్యారు. దాంతో వీళ్ళ భేటిపై రాజకీయంగా ఆసక్తి పెరిగిపోతోంది.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…