ఈరోజు ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అదేపనిగా ఆళ్ళ మంగళగిరి నుండి హైదరాబాద్ కు వచ్చి షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి 9వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెళ్ళిరోజున తెలంగాణాలో రాజకీయ అరంగేట్రాన్ని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.
మామూలుగా అయితే షర్మిల తో ఆళ్ళ భేటి పెద్ద విశేషం ఏమీకాదు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో మాత్రం కచ్చితంగా ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లాకు షర్మిల వెళుతున్నారు. ఇటువంటి సమయంలో ఆళ్ళ స్వయంగా లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి వెళ్ళటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ఎంఎల్ఏ ఆళ్ళ చాలా సన్నిహితుడన్న విషయం తెలిసిందే. షర్మిలతో మాట్లాడేందుకు తన తరపున జగన్ మంగళగిరి ఎంఎల్ఏను పంపించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా దాదాపు గంటసేపు షర్మిలతో ను తర్వాత ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్ తోను ఆళ్ళ విడివిడిగా భేటి అయ్యారు. దాంతో వీళ్ళ భేటిపై రాజకీయంగా ఆసక్తి పెరిగిపోతోంది.
This post was last modified on February 11, 2021 11:01 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…