ఈరోజు ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అదేపనిగా ఆళ్ళ మంగళగిరి నుండి హైదరాబాద్ కు వచ్చి షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి 9వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెళ్ళిరోజున తెలంగాణాలో రాజకీయ అరంగేట్రాన్ని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.
మామూలుగా అయితే షర్మిల తో ఆళ్ళ భేటి పెద్ద విశేషం ఏమీకాదు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో మాత్రం కచ్చితంగా ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లాకు షర్మిల వెళుతున్నారు. ఇటువంటి సమయంలో ఆళ్ళ స్వయంగా లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి వెళ్ళటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ఎంఎల్ఏ ఆళ్ళ చాలా సన్నిహితుడన్న విషయం తెలిసిందే. షర్మిలతో మాట్లాడేందుకు తన తరపున జగన్ మంగళగిరి ఎంఎల్ఏను పంపించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా దాదాపు గంటసేపు షర్మిలతో ను తర్వాత ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్ తోను ఆళ్ళ విడివిడిగా భేటి అయ్యారు. దాంతో వీళ్ళ భేటిపై రాజకీయంగా ఆసక్తి పెరిగిపోతోంది.
This post was last modified on February 11, 2021 11:01 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…