ఈరోజు ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అదేపనిగా ఆళ్ళ మంగళగిరి నుండి హైదరాబాద్ కు వచ్చి షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి 9వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెళ్ళిరోజున తెలంగాణాలో రాజకీయ అరంగేట్రాన్ని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.
మామూలుగా అయితే షర్మిల తో ఆళ్ళ భేటి పెద్ద విశేషం ఏమీకాదు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో మాత్రం కచ్చితంగా ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లాకు షర్మిల వెళుతున్నారు. ఇటువంటి సమయంలో ఆళ్ళ స్వయంగా లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి వెళ్ళటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ఎంఎల్ఏ ఆళ్ళ చాలా సన్నిహితుడన్న విషయం తెలిసిందే. షర్మిలతో మాట్లాడేందుకు తన తరపున జగన్ మంగళగిరి ఎంఎల్ఏను పంపించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా దాదాపు గంటసేపు షర్మిలతో ను తర్వాత ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్ తోను ఆళ్ళ విడివిడిగా భేటి అయ్యారు. దాంతో వీళ్ళ భేటిపై రాజకీయంగా ఆసక్తి పెరిగిపోతోంది.
This post was last modified on February 11, 2021 11:01 pm
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…