క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణాలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముద్ర చాలా ఎక్కువే ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన లాంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలో వచ్చినవే. ఇక ఉచిత విద్య, ఉచిత విద్యుతో, ఆరోగ్యశ్రీ లాంటి అనేక సంక్షేమ పథకాల గురించి చెబితే ముందుగా వైఎస్సారే గుర్తుకొస్తారు. పైగా వైఎస్సార్ రాష్ట్ర విభజనకు నూరుశాతం వ్యతిరేకం.
వైఎస్సార్ ఉన్నంత వరకు కేసీయార్ ప్రత్యేక తెలంగాణా గురించి నోరెత్తితే ఒట్టు. అసెంబ్లీలో విజయరామారావు, హరీష్ రావు లాంటి నేతలు మాట్లాడినా వైఎస్ వాయించేసేవారు. దాంతో మళ్ళీ నోరెత్తే సాహసం చేసేవారు కాదు. అలాంటి వైఎస్ హఠాత్తుగా మరణించటంతో కేసీయార్ కు ధైర్యం వచ్చి ప్రత్యేక తెలంగాణా ఊపందుకుంది. 2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందే నీళ్ళు, ఉద్యోగాలు, ఉపాధి, ఆత్మగౌరవం అనే నినాదాలతో.
ఏ లక్ష్యంతో అయితే ప్రత్యేక తెలంగాణా వచ్చిందో ఆ లక్ష్యం నెరవేరలేదనే చెప్పాలి. కేసీయార్ సీఎం అయి ఏడు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేయలేదు. ఉపాధి అవకాశాలు ఎంతమందికి దక్కాయో దేవుడికే తెలియాలి. ఇక ఆత్మగౌరవం అన్న పదానికి అర్ధమే మారిపోయింది. ఇదే విషయాన్ని తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా ఉన్న జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తో పాటు అనేకమంది ఉద్యమకారులు కేసీయార్ ను తిడుతున్నారు.
ఉద్యమం పేరుతో జనాలను కేసీయార్ మోసం చేశారని కోదండరామ్ తో పాటు అనేకమంది తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపధ్యంలో కేసీయార్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, టీడీపీలు ఫెయిలయ్యాయనే చెప్పాలి. బీజేపీకి అంత సీన్ లేదనే అనుకోవాలి. ఇటువంటి నేపధ్యంలోనే కేసీయార్ వైఫల్యాల ఆధారంగానే రాజకీయ శూన్యతను భర్తీ చేయటం కోసమే షర్మిల వైఎస్సార్సీపీ తెలంగాణా అనే పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
మీడియాతో షర్మిల మాట్లాడుతూ తెలంగాణా వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఉచిత విద్య అందుతోందా ? వైద్యం అందుతోందా ? ఇళ్ళ పట్టాలు ఎంతమందికి అందాయి ? రైతులు సంతోషంగా ఉన్నారా ? అంటు ప్రశ్నించటం గమనార్హం. అంటే షర్మిల తన కొత్తపార్టీ అజెండా ఏమిటో చెప్పకనే చెప్పినట్లయ్యింది.
This post was last modified on February 10, 2021 4:07 pm
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…