Political News

కొడుకు కోసం జానారెడ్డి సైలెంట్ స్కెచ్ ?

తొందరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా తన కొడుకు రఘువీర్ రెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎందుకైనా మంచిదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందాన్ని రంగంలోకి దింపారట. రానున్న ఎన్నికల్లో తాను కానీ లేకపోతే తన కొడుకు కానీ రంగంలోకి దిగితే ప్రజాస్పందన ఎలాగుంటుందనే విషయంలో జననాడిని పట్టుకునేందుకు ప్రశాంత్ తో జానారెడ్డి సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణాలో ఇపుడు అన్నీ పార్టీల దృష్టి నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక మీదే ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీనే తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలన్న ఉద్దేశ్యంతో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే అనేకమంది నేతలు తమ పార్టీల తరపున బరిలోకి దిగటానికి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిజానికి ఈ అసెంబ్లీ స్ధానం కాంగ్రెస్ కు కంచుకోటనే చెప్పాలి. ఎలాగంటే ఇక్కడి నుండే జానారెడ్డి ఏడుసార్లు గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య గెలిచారు.

అనారోగ్యం వల్ల నోముల మరణంతో ఇక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా జానారెడ్డికి మాత్రం మంచి డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీల తరపున పోటీ చేయాల్సిందిగా జానారెడ్డికి ఆఫర్ ఇచ్చాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆయన మాత్రం కాంగ్రెస్ తరపునే పోటీ చేయాలని మొదటినుండి అనుకుంటున్నారట. అయితే ఈ మధ్యనే కొడుకును రంగంలోకి దింపాలనే ఆలోచన వచ్చిందంటున్నారు. అందుకనే కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారట.

ఎందుకైనా మంచిదని వ్యూహకర్త ప్రశాంత్ తో చర్చలు జరిపారట. అసలు ఏ పార్టీ పరిస్ధితి ఏమిటి ? కాంగ్రెస్ తరపున తాను పోటీ చేస్తే ఎలాగుంటుంది ? లేకపోతే తన కొడుకును రంగంలోకి దింపితే ఫలితం ఎలాగుంటుందనే విషయాలపై సర్వేలు చేయించుకోవాలని అనుకున్నారట. జానారెడ్డి అడిగిన తర్వాత ప్రశాంత్ బృందం వెంటనే రంగంలోకి దిగేసిందని సమాచారం. సో జానారెడ్డి పోటీ విషయంలో బాగా సీరియస్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది.

This post was last modified on February 9, 2021 4:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jana Reddy

Recent Posts

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

47 minutes ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

3 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

5 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

7 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

7 hours ago

నోటాతో పోటిపడ్డ నేతకు జగన్ రెడ్ కార్పెట్

ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…

7 hours ago