Political News

కొడుకు కోసం జానారెడ్డి సైలెంట్ స్కెచ్ ?

తొందరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా తన కొడుకు రఘువీర్ రెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎందుకైనా మంచిదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందాన్ని రంగంలోకి దింపారట. రానున్న ఎన్నికల్లో తాను కానీ లేకపోతే తన కొడుకు కానీ రంగంలోకి దిగితే ప్రజాస్పందన ఎలాగుంటుందనే విషయంలో జననాడిని పట్టుకునేందుకు ప్రశాంత్ తో జానారెడ్డి సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణాలో ఇపుడు అన్నీ పార్టీల దృష్టి నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక మీదే ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీనే తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలన్న ఉద్దేశ్యంతో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే అనేకమంది నేతలు తమ పార్టీల తరపున బరిలోకి దిగటానికి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిజానికి ఈ అసెంబ్లీ స్ధానం కాంగ్రెస్ కు కంచుకోటనే చెప్పాలి. ఎలాగంటే ఇక్కడి నుండే జానారెడ్డి ఏడుసార్లు గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య గెలిచారు.

అనారోగ్యం వల్ల నోముల మరణంతో ఇక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా జానారెడ్డికి మాత్రం మంచి డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీల తరపున పోటీ చేయాల్సిందిగా జానారెడ్డికి ఆఫర్ ఇచ్చాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆయన మాత్రం కాంగ్రెస్ తరపునే పోటీ చేయాలని మొదటినుండి అనుకుంటున్నారట. అయితే ఈ మధ్యనే కొడుకును రంగంలోకి దింపాలనే ఆలోచన వచ్చిందంటున్నారు. అందుకనే కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారట.

ఎందుకైనా మంచిదని వ్యూహకర్త ప్రశాంత్ తో చర్చలు జరిపారట. అసలు ఏ పార్టీ పరిస్ధితి ఏమిటి ? కాంగ్రెస్ తరపున తాను పోటీ చేస్తే ఎలాగుంటుంది ? లేకపోతే తన కొడుకును రంగంలోకి దింపితే ఫలితం ఎలాగుంటుందనే విషయాలపై సర్వేలు చేయించుకోవాలని అనుకున్నారట. జానారెడ్డి అడిగిన తర్వాత ప్రశాంత్ బృందం వెంటనే రంగంలోకి దిగేసిందని సమాచారం. సో జానారెడ్డి పోటీ విషయంలో బాగా సీరియస్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది.

This post was last modified on February 9, 2021 4:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jana Reddy

Recent Posts

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

4 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

7 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

8 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

9 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

10 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

11 hours ago