టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఎమ్మ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు.. అప్పటి నుంచి తటస్థంగా ఉంటున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు ఆయన కుమారుడిని కూడా వైసీపీలో చేర్చుతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. ఎందుకో.. గంటా ఎటూ నిర్ణయం తీసుకోలేదు.
ఇక, తనకు టికెట్ ఇచ్చిన టీడీపీలోనూ ఆయన గడిచిన రెండేళ్లుగా యాక్టివ్గా ఉండడం లేదు. పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అధినేత చంద్రబాబుకు కూడా అందడం లేదని పార్టీలోనే పెద్ద చర్చ సాగింది. ఇక, ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం కొన్నాళ్లు సాగింది. ఆయన కనుసన్నల్లోనే కొందరు టీడీపీకి కొందరు రాజీనామా చేశారనేది వాస్తవం. ఇక, ఇప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
అయితే.. ఆయన చెబుతున్నరీజన్ ఏంటంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో దీనికి నిరసనగానే తాను,.. రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లో చేసిన ఈ రాజీనామాను ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంకు కొద్ది సేపటి కిందట పంపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. మరి గంటా పిలుపును ఎంత మంది అందిపుచ్చుకుంటారో చూడాలి.
This post was last modified on February 6, 2021 2:53 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…