టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఎమ్మ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు.. అప్పటి నుంచి తటస్థంగా ఉంటున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు ఆయన కుమారుడిని కూడా వైసీపీలో చేర్చుతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. ఎందుకో.. గంటా ఎటూ నిర్ణయం తీసుకోలేదు.
ఇక, తనకు టికెట్ ఇచ్చిన టీడీపీలోనూ ఆయన గడిచిన రెండేళ్లుగా యాక్టివ్గా ఉండడం లేదు. పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అధినేత చంద్రబాబుకు కూడా అందడం లేదని పార్టీలోనే పెద్ద చర్చ సాగింది. ఇక, ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం కొన్నాళ్లు సాగింది. ఆయన కనుసన్నల్లోనే కొందరు టీడీపీకి కొందరు రాజీనామా చేశారనేది వాస్తవం. ఇక, ఇప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
అయితే.. ఆయన చెబుతున్నరీజన్ ఏంటంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో దీనికి నిరసనగానే తాను,.. రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లో చేసిన ఈ రాజీనామాను ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంకు కొద్ది సేపటి కిందట పంపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. మరి గంటా పిలుపును ఎంత మంది అందిపుచ్చుకుంటారో చూడాలి.
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…