టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఎమ్మ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు.. అప్పటి నుంచి తటస్థంగా ఉంటున్నారు. అధికార వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు ఆయన కుమారుడిని కూడా వైసీపీలో చేర్చుతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. ఎందుకో.. గంటా ఎటూ నిర్ణయం తీసుకోలేదు.
ఇక, తనకు టికెట్ ఇచ్చిన టీడీపీలోనూ ఆయన గడిచిన రెండేళ్లుగా యాక్టివ్గా ఉండడం లేదు. పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అధినేత చంద్రబాబుకు కూడా అందడం లేదని పార్టీలోనే పెద్ద చర్చ సాగింది. ఇక, ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం కొన్నాళ్లు సాగింది. ఆయన కనుసన్నల్లోనే కొందరు టీడీపీకి కొందరు రాజీనామా చేశారనేది వాస్తవం. ఇక, ఇప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
అయితే.. ఆయన చెబుతున్నరీజన్ ఏంటంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో దీనికి నిరసనగానే తాను,.. రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లో చేసిన ఈ రాజీనామాను ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంకు కొద్ది సేపటి కిందట పంపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. మరి గంటా పిలుపును ఎంత మంది అందిపుచ్చుకుంటారో చూడాలి.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…