Political News

బ‌స్సులు, రైళ్లు ఈ నెల‌లోనే తిరుగుతాయ్

క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా నెల‌న్న‌ర రోజులుగా ప్ర‌జా ర‌వాణా ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్లు ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో సొంత వాహ‌నాలు పెట్టుకుని.. లేదా ప్ర‌భుత్వమే ఏర్పాటు చేసిన‌ ప్ర‌త్యేక రైళ్లు, బ‌స్సుల ద్వారా స్వ‌స్థ‌లాల‌కు చేరే ప్ర‌య‌త్నం చేశారు. చేస్తున్నారు.

ఐతే ఇంత క‌ష్ట‌ప‌డ‌లేక సాధార‌ణ ప్ర‌జా రవాణా ఎప్పుడు పున‌రుద్ధ‌రిస్తారా అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ శుభ వార్త చెప్పారు. త్వ‌ర‌లోనే ప్ర‌జా రవాణాను మొద‌లుపెట్ట‌డానికి కేంద్రం స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. బ‌హుశా మే నెల‌లోనే బ‌స్సులు, రైళ్ల‌ను పాక్షికంగా అయినా పున‌రుద్ధ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామ‌ని నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని చెప్పారు. ఈ మేరకు కారు, బస్సు ఆపరేటర్స్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

రవాణా రంగానికి సంబంధించి వచ్చిన బెయిల్ఔట్‌ ప్యాకేజీ గురించి ప్రస్తావనకు రాగా.. ఈ రంగంలో ఉన్న అన్ని సమస్యలూ తనకు తెలుసని గడ్కరీ అన్నారు. రవాణా రంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా రవాణాకు లండన్‌ మోడల్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు పునః ప్రారంభయ్యాయని గడ్కరీ తెలిపారు. మే 17న కేంద్రం ప్ర‌క‌టించిన మూడో లాక్ డౌన్ గ‌డువు ముగుస్తుంది. ఆ త‌ర్వాత ప్ర‌జా రవాణా పునఃప్రారంభించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on May 7, 2020 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago