కరోనా వ్యాప్తిని నివారించేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నెలన్నర రోజులుగా ప్రజా రవాణా ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్లు ప్రభుత్వ అనుమతులతో సొంత వాహనాలు పెట్టుకుని.. లేదా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా స్వస్థలాలకు చేరే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు.
ఐతే ఇంత కష్టపడలేక సాధారణ ప్రజా రవాణా ఎప్పుడు పునరుద్ధరిస్తారా అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభ వార్త చెప్పారు. త్వరలోనే ప్రజా రవాణాను మొదలుపెట్టడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బహుశా మే నెలలోనే బస్సులు, రైళ్లను పాక్షికంగా అయినా పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని చెప్పారు. ఈ మేరకు కారు, బస్సు ఆపరేటర్స్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
రవాణా రంగానికి సంబంధించి వచ్చిన బెయిల్ఔట్ ప్యాకేజీ గురించి ప్రస్తావనకు రాగా.. ఈ రంగంలో ఉన్న అన్ని సమస్యలూ తనకు తెలుసని గడ్కరీ అన్నారు. రవాణా రంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా రవాణాకు లండన్ మోడల్ను పరిశీలిస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు పునః ప్రారంభయ్యాయని గడ్కరీ తెలిపారు. మే 17న కేంద్రం ప్రకటించిన మూడో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రజా రవాణా పునఃప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on May 7, 2020 6:24 pm
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…