కొత్త వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడిపై అన్నీ వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోతోంది. గడచిన మూడు మాసాలుగా ఢిల్లీ శివార్లలోని మూడు వైపులా వేలాదిమంది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాల రద్దును మోడి వ్యక్తిగతంగా చాలా ప్రిస్టేజిగా తీసుకున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోను చట్టాలను రద్దు చేసేది లేదని ఎప్పటినుండో పట్టుదలగా ఉన్నారు. దాంతో ఢిల్లీ-హర్యానా శివార్లలోని సింఘూ ప్రాంతంలో జరిపిన ఉద్యమం ఫలితంగా చట్టాల అమలును ఏడాదిన్నర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఏడాదిన్నర కాదని మొత్తానికే రద్దు చేయాలంటున్నారు రైతులు. ఈ నేపధ్యంలోనే జనవరి 26వ తేదీన ఢిల్లీ రోడ్లపై జరిగిన ర్యాలీ ఎంతటి వివాదాస్పదమైందో అందరు చూసిందే. ర్యాలీ వివాదాస్పదమైంది కాబట్టి ఉద్యమం నీరుగారిపోతుందని అనుకున్నారు. అయితే ఉల్టాగా మరింత ఉదృతంగా ఉద్యమం జరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో చట్టాల రద్దు విషయంలో మోడిపై అన్నీవైపుల నుండి ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోని 400 మందకి పైగా భారతీయ విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయరంగానికి రైతాంగానికి పెనుముప్పుగా తయారవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు, అట్టడుగు వర్గాల కోసం కేంద్రం చట్టాలు చేసేముందు సమాజంలో చర్చలు జరగాలంటూ విద్యావేత్తలు మోడికి సూచించారు. రైతులు వ్యవతిరేకిస్తున్న కొత్త చట్టాలను అమలు చేసే విషయంలో కేంద్రం పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రికి హితవు పలికారు.
నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ప్రధానికి లేఖ రాసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటి, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి బెంగుళూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కోల్ కత్తా, ముంబాయ్, కోలకత్తా ఐఐటిలతో పాటు విదేశాల్లో పనిచేసే అనేక విశ్వవిద్యాలయల ప్రొఫెసర్లు కూడా సంతకాలు చేశారు. గతనెలలోనే 850 మంది విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు ఇదే విధమైన లేఖను మోడికి పంపారు.
వీరు కాకుండా సెలబ్రిటీలు, ప్రతిపక్షాలు, రైతుకూలీలు, వ్యవసాయ సంఘాలు, అసంఘితరంగంలోని కార్మిక నేతలు కూడా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్నారు. అన్నీ వైపుల నుండి ఒత్తిళ్ళు పెరిగిపోతున్న కారణంగానే పార్లమెంటులో వ్యవసాయ చట్టాలపై 15 గంటల చర్చకు మోడి సిద్ధమని ప్రకటించారు. మరి ఇన్ని వైపుల నుండి వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత పెరిగిపోతున్నా చివరకు మోడి ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on February 4, 2021 10:05 am
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…